దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభిస్తూ భారతదేశం స్వావలంబన మార్గంలో ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ వేడుకలో కొత్తగా చేరిన 75,000 మంది నియామక పత్రాలను అందజేసినట్టు తెలిపారు.
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనీ, ఎనిమిదేళ్లలో దేశం 10వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని గుర్తు చేశారు. భారతదేశం.. యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించి ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచిందని తెలిపారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
గత ఏడు-ఎనిమిదేళ్లలో ఆర్థిక వృద్ధికి అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగించడం వల్ల ఇది సాధ్యమైందని రోజ్గార్ మేళా కోసం నిర్వహించిన వర్చువల్ ఈవెంట్లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ చెప్పారు. అనేక పెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నేడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు… 100 సంవత్సరాలలో అతిపెద్ద సంక్షోభం దుష్ప్రభావాలతో పోరాడుతున్నాయని తెలిపారు.
అనేక దేశాలకు భారీ ఆర్థిక పతనాన్ని తెచ్చిన కరోనా వైరస్ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సమయంలో భారత్ లో మెరుగైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ రిక్రూట్మెంట్ డ్రైవ్ 10 లక్షల మందికి పైగా లక్ష్యంగా ఉంది. వారిలో 75,000 మందికి శనివారం ఆఫర్ లెటర్లు వచ్చాయి.
రాబోయే నెలల్లో, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 2014లో కొన్ని స్టార్టప్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 80,000 మార్కును దాటింది. భారతీయ సంస్థలు కూడా ఎక్కువగా స్వావలంబనగా మారుతున్నాయి. అనేక రంగాలలో, భారతదేశం గ్లోబల్ హబ్గా మారే మార్గంలో ఉందని ప్రధాని వివరించారు.
శతాబ్దానికి ఒకసారి వచ్చే ఈ మహమ్మారి దుష్ప్రభావాలు 100 రోజుల్లో పోలేవని ప్రధాని స్పష్టం చేశారు. “కానీ ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొన్నప్పటికీ, దీని ప్రభావం ప్రతిచోటా అనుభవించబడుతోంది. ఈ సమస్యల బారిన పడకుండా మన దేశాన్ని రక్షించడానికి భారతదేశం కొత్త కార్యక్రమాలను చెపడుతోంది” అని ప్రధాని చెప్పారు.