ఇరానీ టాటా స్టీల్ రిటైర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ జంషెడ్ పూర్ లో కన్నుమూసారు. ఆయన భారత ఉక్కు మనిషిగాపేరొందారు. ఇరానీ 2011లో టాటా స్టీల్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి పదవీ విరమణ పొందారు.
టాటా స్టీల్ కంపెనీ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన జంషెడ్ ఇరానీ.. 43 ఏళ్ల పాటు సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. జూన్ 2, 1936 న నాగ్పూర్లో జిజి ఇరానీ, ఖోర్షెడ్ ఇరానీలకు జన్మించాడు 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆయనకు భార్య డైసీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ప్రపంచంలోనే అతి తక్కువ ధర కలిగిన ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించడంపై దృష్టి సారించి, టాటా స్టీల్ను తిరిగి ఆవిష్కరించుకునేలా చేశారు. 2003లో టాటా ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. ఇరానీ 1992-93కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.
1996లో రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ ఇంటర్నేషనల్ ఫెలోగా నియమితులయ్యారు, 1997లో ఇండో-బ్రిటిష్ ట్రేడ్ కో-ఆపరేషన్కు చేసిన కృషికి క్వీన్ ఎలిజబెత్ IIచే గౌరవ నైట్హుడ్తో సహా అనేక గౌరవాలు పొందారు. 2004లో, భారత ప్రభుత్వం కొత్త కంపెనీల చట్టం ఆఫ్ ఇండియా ఏర్పాటుకు నిపుణుల కమిటీ ఛైర్మన్గా డాక్టర్ ఇరానీని నియమించింది.
పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గాను 2007లో పద్మభూషణ్తో సత్కరించారు. మెటలర్జీ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వంచే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.
1956లో సైన్స్ కళాశాల నుండి బిఎస్సి, 1958లో నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి జియాలజీలో ఎంఎస్సి పొందారు. తర్వాత యుకెలోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో 1960లో మెటలర్జీలో మాస్టర్స్, 1963లో పీహెచ్డీని పొందారు.