ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవినిఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా గుర్తించామని కేంద్ర సమాచార ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ రాకూర్ ప్రకటించారు. చలన చిత్ర రంగానికి చిరంజీవి అందించిన సేవలకు గుర్తింపుగా జీవన సాఫల్య అవార్డు బహూకరిస్తామని ఠాకూర్ ప్రకటించారు.
గోవాలో 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభ వేడుకల్లో ఠాకూర్ చిరంజీవికి జీవన సాఫల్య అవార్డు ప్రధానం చేస్తామని అన్నారు. చిరంజీవి నాలుగు శతాబ్దాలుగా చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. 150కి పైగా చిత్రాల్లో చిరంజీవి నటించారని ఠాకూర్ పేర్కొన్నారు.
‘ చిరంజీవి గుర్తింపు పొందిన భారతీయ నటుడు, డాన్సర్, చలన చిత్ర నిర్మాత, పరోపకారి, ఒక రాజకీయవేత్త. ప్రధానంగా తెలుగు సినిమాల్లో నటించిన చిరంజీవి హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటించారు’ అని ఠాకూర్ వివరించారు. పద్మభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు, నంది లాంటి అనేక అవార్డులను చిరంజీవి అందుకున్నారని తెలిపిన ఆయన ప్రేక్షకుల అభిమానం చిరంజీవికి మెగాస్టార్ గుర్తింపు తెచ్చిందని చెప్పారు.
1978లో ‘పందిరిల్లు’ సినిమాతో చిరంజీవి చలన చిత్ర రంగంలో ప్రవేశించారు. 1982 లో చిరంజీవి ‘ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో సామాన్య ప్రజల హీరోగా మారారు. సినిమాల్లో చిరంజీవి డాన్సులు, ఫైటింగ్ దృశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
వివిధ సంస్థల ద్వారా చిరంజీవి సమాజానికి సేవలు అందిస్తున్నారు. 1998లో ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నెలకొల్పారు.తొమ్మిది రోజుల పాటు జరిగే చలన చిత్రోత్సవాలను కేంద్ర సమాచార,ప్రసార, యువజన వ్యవహారాలు,క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ జ్యోతి వెలిగించి ఆదివారం ప్రారంభించారు.
సినిమా నిర్మాణ, నిర్మాణ అనంతర కార్యక్రమాలకు భారతదేశం కేంద్రంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఠాకూర్ తన ప్రారంభ ఉపన్యాసంలో పేర్కొన్నారు. దేశంలో అపారంగా ఉన్న శక్తి సామర్ధ్యాలు, వినూత్నంగా ఆలోచించే మేధస్సు, పరిశ్రమ సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటామని ఠాకూర్ ప్రకటించారు. ‘
“ఐఎఫ్ఎఫ్ఐ ఒక కార్యక్రమ నిర్వహణకు పరిమిత కాకూడదు. భారతదేశం తన స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఐఎఫ్ఎఫ్ఐ తన కార్యక్రమాలను విస్తృతం చేయాలి. అమృత్ మహోత్సవ్ నుంచి అమృత కాలంలోకి భారతదేశం అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఉత్సవాలను పెద్ద సంఖ్యలో నిర్వహించి సినిమా రూపకల్పన, నిర్మాణం రంగాల్లో భారతదేశం ప్రపంచంలో అగ్ర స్థానంలో సాధించాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది” అని అనురాగ్ సింగ్ ఠాకూర్ వివరించారు.
తాను స్వయంగా రూపొందించిన ‘ 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికను ఠాకూర్ వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది ఒక ఆలోచన శక్తిని గుర్తిస్తుందని ఠాకూర్ తెలిపారు. ఆలోచనలకు పదును పెట్టి తమ లక్ష్యాలు, ఆశయాలు సాధించేలా యువతను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ ‘ 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.