రాజ్యసభ కొత్త చైర్మన్గా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర నేతలు ధన్కర్ను చైర్మన్ సీటు వరకు తీసుకుని వెళ్లారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సందర్భంగా ధన్కర్కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాస్వామ్య విలువలను ధన్కర్ కొనసాగిస్తారని అధికార పార్టీ సభ్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న పార్టీలకు మరింత సమయం ఇవ్వాలని, ప్రభుత్వ బిల్లుల స్క్రూటినీ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను బలోపేతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
లోక్సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఇటీవల మరణించిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్, 8 మంది మాజీ సభ్యులకు నివాళులర్పించింది. ద మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్(అమెండ్మెంట్) బిల్లు, 2022ను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది.
ధన్కర్కు స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ రాజ్యసభ చైర్మన్గా ధన్కర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడతారని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయన ఒక రైతు కొడుకని, సైనిక స్కూల్లో చదువుకున్నారని చెప్పారు.
ధన్కర్కు లీగల్ ‘భారతదేశం ఇప్పుడే జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. మనం అమృతకాలంలో ప్రయాణం ప్రారంభించిన సమయం కూడా ఇదే. ఇలాంటి చారిత్రక తరుణంలో రైతు బిడ్డ, సైనిక స్కూల్లో చదివిన ధన్ఖడ్ సమర్థ నాయకత్వం ఈ సభకు దక్కడం శుభపరిణామం’ అని మోదీ కొనియాడారు.
అంశాలపై ఎంతో పట్టుఉందని పేర్కొన్నారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. సభ సజావుగా సాగేందుకు అండగా ఉంటామని ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు.
రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జగదీప్ ధన్కర్ తొలిసారి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వంలోని 3 వ్యవస్థలు ఒక్కదాని విషయంలో మరొకటి జోక్యం చేసుకుంటే పాలన దెబ్బతింటుందని, అందువల్ల అందరూ ‘లక్ష్మణరేఖ’ను గౌరవించాలని కోరారు.