జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ముంజ్ మార్గ్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.
ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను షోపియాన్ కు చెందిన లతీఫ్ లోన్, అనంతనాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. కాశ్మీరీ పండిత పురాణ కృష్ణ భట్ హత్యలో లతీఫ్ లోన్, నేపాల్ కు చెందిన టిల్ బహదూర్ థాపా హత్యలో ఉమర్ నజీర్ ప్రమేయం ఉందని పోలీసులు ట్వీట్ చేశారు.
మరో ఉగ్రవాది ఆచూకీ తెలియాల్సి వుందని అన్నారు. వీరికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుండి ఎకె 47 రైఫిల్, రెండు పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.