టీడీపీ- జనసేన పార్టీల మేనిఫెస్టో కమిటీ సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలోజరిపిన భేటీలో 11 అంశాలతో ఉమ్మడి మినీ మ్యానిఫెస్టోను రూపొందించారు. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లు పాల్గొనగా.;. జనసేన తరపున ముత్తా శశిధర్, డి. వరప్రసాద్, ప్రొఫెసర్ కె. శరత్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఇది కేవలం ప్రాధమిక సమావేశం మాత్రమే అని చెబుతూ గతంలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ’ మినీ మేనిఫెస్టో విడుదల చేశామని గుర్తు చేశారు. ఇందులో సూపర్ సిక్స్ అనేదానిపై ప్రచారం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ- జనసేన పొత్తు అనంతరం మొదటి మీటింగ్ రాజమండ్రిలో పవన్, లోకేశ్ లతోపాటు జాయింట్ యాక్షన్ కమిటి సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రెండు పార్టీల నుంచి ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరుగురి సభ్యులతో కమిటీ ఏర్పాటుచేశామని వివరించారు.…
Author: Editor's Desk, Tattva News
మణిపూర్లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయితీకి చెందిన తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ)ని ఐదేళ్ల పాటు చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది. ఆ పార్టీ రాజకీయ విభాగాలైన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్పిఎఫ్), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్), దాని సాయుధ విభాగం మణిపూర్ పీపుల్స్ ఆర్మీ(ఎంపిఎ)లను కూడా నిషేధిస్తూ హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పిఆర్ఇపిఎకె), రెడ్ ఆర్మీ కంగ్లీపాక్ కమ్యూనిస్టు పార్టీ (కెసిపి), కంగ్లీ యవోల్ కంబా లుప్ (కెవైకెఎల్), కో ఆర్డినేషన్ కమిటీ (కోర్ కామ్) ఎలియన్స్ ఫర్ సోషలిస్ట్ యూనిటీ కంగ్లీపాక్ (ఎఎస్యుకె) లను కూడా హోం మంత్రిత్వశాఖ నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 లోని సెక్షన్ 37 కింద ఈ నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధిస్తున్నట్టు ప్రకటించింది. మయన్మార్లో హింసాత్మక దాడులపై అప్రమత్తం ఇలా…
చత్తీస్ఘఢ్లో కాంగ్రెస్ నిష్క్రమణకు కౌంట్డౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తొలి దశ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతం ఖాయమైందని ఆయన వెల్లడించారు. నవంబర్ 17న మలి దశ పోలింగ్కు ముందు సోమవారం ముంగేలిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ దౌర్భాగ్య పాలనకు చత్తీస్ఘఢ్ ప్రజలు చరమగీతం పాడనున్నారని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఐదేండ్ల పాటు మిమ్మల్ని దోచుకున్న కాంగ్రెస్ పాలకులను సాగనంపే సమయం ఆసన్నమైందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇక ఎంతమాత్రం కోరుకోవడం లేదని ప్రధాని తెలిపారు. చత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ రాష్ట్రంలో అవినీతి పాలనతో కోట్లు దండుకున్నారని మోదీ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తే అవినీతి నేతలపై చర్యలు చేపడుతుందని ప్రధాని వెల్లడించారు. చత్తీస్ఘఢ్ సీఎం తన నియోజకవర్గంలో ఓడిపోతారని మీడియా మిత్రులు తనకు చెప్పారని వివరించారు. అబద్ధపు…
తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరుసటి రోజే కేబినెట్లో కీలక మార్పులు చేశారు. హోం మంత్రి (సెక్రటరీ) పదవి నుంచి భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మాన్ను తప్పించిన రిషి ఆమె స్థానంలో విదేశాంగ మంత్రిగా పని చేస్తోన్న జేమ్స్ క్లెవర్లీని హో మంత్రిగా నియమించారు. అదే సమయంంలో ఊహించని రీతిలో మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్కు విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. 2010-16 మధ్య కాలంలో యూకే ప్రధానిగా పని చేసిన కామెరాన ఇప్పుడు రిషి సునాక్ కేబినెట్లో మంత్రిగా పని చేయనుండటం గమనార్హం.కామెరాన్ నియామకం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేసింది. మాజీ ప్రధాని అయిన కామెరాన్కు ప్రస్తుతం యూకే చట్ట సభ్యల్లో సభ్యత్వం లేదు. సాధారణంగా ఉన్నతమైన ప్రభుత్వ పదవుల్లోకి చట్ట సభ్యులనే తీసుకుంటారు. అయినా సరే రిషి సునాక్ కామెరాన్కు కీలకమైన…
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ ను కలిశారు. జైశంకర్ తన భార్య కోక్యోతో కలిసి ఆదివారం యూకే ప్రధాన మంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ కు వెళ్లారు. జైశంకర్ దంపతులకు సునాక్ దంపతులు సాదర స్వాగతం పలికారు. సునాక్కు భారత ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని అందించారు. దాంతోపాటు భారత స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను కూడా సునాక్కు బహుమతిగా ఇచ్చారు.ఇందుకు సంబంధించిన ఫొటోలను యూకే ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. రిషి సునాక్, జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. మరోవైపు ఈ విషయాన్ని జై శంకర్ సైతం ఎక్స్ వేదికగా…
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న గాలి కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ టాప్లో నిలిచింది. అయితే ఇటీవల ఢిల్లీలో మోస్తరు వర్షం పడటంతో గాలి నాణ్యత కొంత మెరుగైంది. కానీ దీపావళి పండగ సందర్భంగా ప్రభుత్వం, సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలను బేఖాతరు చేసిన ఢిల్లీ వాసులు భారీగా బాణసంచా కాల్చడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీపావళి ఎఫెక్ట్తో మరోసారి ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. ఇక దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీతోపాటు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో టాప్ 10 లోకి చేరిపోయాయి. స్విస్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే 10 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో భారత్ నుంచి 3 నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలవగా…
నాంపల్లిలోని బజారఘాట్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంటు గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది సజీవ దహనమయ్యారు. మంటల్లో మరికొంత మంది చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అపార్టుమెంటు ముందు పార్క్ చేసి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. అపార్టుమెంటులో మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని డీసీపీ తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లోనే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకుని…
తెలంగాణలో పోలింగ్కు మరో 17 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. నగరంలోని పలు చోట్ల సోమవారం ఉదయం నుంచే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది, ఇల్లు ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మెుత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. మై హోం భూజాలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు.. ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లుగా సమాచారం. ఎన్నికల దగ్గరపుడతున్న వేళ రాజకీయ నాయకులకు ఫార్మా కంపెనీలు నిధులు సమకూర్చే ఉందని, అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలోనూ…
ప్రపంచకప్ టోర్నీలో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన దీపావళిని పంచింది. తొలుత శ్రేయస్ (128 ), రాహుల్ (102), రోహిత్ (61), గిల్ (51), కోహ్లీ (51) సీమ టపాకాయల్లా పేలగా.. టీమ్ఇండియా 410 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్లు ఆఖరివరకూ పోరాడి 250 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. బౌలర్లతోపాటు టీమ్ఇండియా బ్యాటర్లు సైతం బౌలింగ్ వేసి అలరించారు. కోహ్లీ, రోహిత్ ఏకంగా ఒక్కో వికెట్ తీశారు.బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, నెదర్లాండ్ జట్టులో మ్యాక్స్ 30, కొలిన్ 35, సింబ్రాండ్ 45, తెలుగు కుర్రాడు తేజ 54 పరుగులు చేశారు..ఇక 411 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ దిగిన నెదర్లాండ్ బెంగళూరు పిచ్ చిన్నదే గాక బ్యాటింగ్కు అనుకూలించేది కావడంతో డచ్ బ్యాటర్లు కూడా అంత…
ఎన్నికల సమయంలో దాదాపు చిన్న, చితక రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు వాగ్ధానాలు చేస్తూ ఎన్నికల ప్రణాళికలను విడుదల చేస్తుంటాయి. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో రాతపూర్వకంగా మ్యానిఫెస్టో పేరుతో ప్రకటిస్తాయి. వాటిని అమలు చేస్తారా అనేది అటుంచితే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం అన్ని రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. జాతీయ స్థాయికి ఎదగడానికి ప్రయత్నిస్తూ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న అఖిల భారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ మాత్రం అందుకు అతీతం అని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు అయినా, పార్లమెంటు ఎన్నికలు అయినా, స్థానిక సంస్థల ఎన్నికలు అయినా ఏ ఎన్నిక అయినా మ్యానిఫెస్టో రూపంలో ప్రజలకు వాగ్దానం చేయడం ఆ పార్టీ చరిత్రలో లేదు. ఏ నాడు మ్యానిఫెస్టో విడుదలకు ప్రయత్నించిన దాఖలాలు లేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి స్వయంగా ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడు…