పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు ప్రత్యేక కోర్టు జూన్ 24 వరకు పొడిగించింది. 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయన కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31న జర్మనీ నుంచి బెంగళూరుకు వచ్చిన రేవణ్ణను విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అరెస్టు చేశారు. హాసన్లో ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఏప్రిల్ 27న ఆయన జర్మనీకి వెళ్లారు. అయితే 28న హాసన్ జిల్లా హోలెనరసిపురలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. రేవణ్ణపై 47ఏళ్ల మాజీ పనిమనిషిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు, 3 లైంగిక వేధింపుల కేసులు, అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో జేడీఎస్ పార్టీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్గా మారాయి. ఈ కేసులో ఎంపీ ప్రజ్వల్తో…
Author: Editor's Desk, Tattva News
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్’ పరీక్షల్లో అవకతవకలు జరగడం, పేకర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పరీక్షలు నిర్వహిస్తున్న జాతీయ పరీక్ష మండలి (ఎన్టీఏ )పై మండిపడింది. నీట్-యూజీ, 2024 పరీక్షల్లో ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థగా ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా న్యాయంగా వ్యవహరించాలని, తప్పిదం జరిగితే జరిగిందని అంగీకరించాలని, చర్యలు తీసుకున్నామని వివరించాలని ఎన్టీఏకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్వీఎన్ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదని, పరీక్షలు నిర్వహిస్తున్న ఏజెన్సీగా ఎన్టీఏ న్యాయబద్ధంగా వ్యవహరించాలని ధర్మాసనం పేర్కొంది. ”పొరపాటు జరిగితే కనీసం ఫలానా చర్య తీసుకున్నామని చెప్పినా అది మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎన్డీఏ నుంచి సకాలంలో సరైన చర్యలను ఆశిస్తున్నాం” అని తెలిపింది. తదుపరి విచారణను…
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. జమ్మూ కశ్మీర్ లో సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్తో పాటు జమ్మూ కశ్మీర్కు ఎన్నికల ఇంఛార్జిలను, కో ఇంఛార్జిలను అధిష్ఠానం నియమించింది. సెప్టెంబర్లోగా జమ్మూ కశ్మీర్కు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది అధిష్ఠానం. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ సర్కారులో.. నరేంద్ర మోదీ జట్టులో కిషన్ రెడ్డికి రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అందులోనూ.. కీలక శాఖ అయిన బొగ్గు, గనుల శాఖను కేటాయించటం విశేషం. ఇవే కాకుండా ఇప్పుడు ఏకంగా సున్నిత రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్కు ఎన్నికల ఇంఛార్జిగా…
పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగల్ జంపింగే కారణమా? అనే చర్చ జరుగుతోంది. సిగల్ జంప్ కారణంగా ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు సిఇఒ జయ వర్మ సిన్హా తెలిపారు. నిర్వహణా లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ విమర్శించింది. దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ డిమాండ్ చేశారు. రైల్వే ప్రమాదాలు పెరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే భద్రతా కమిషనర్ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తారని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే గూడ్స్ రైలు డ్రైవర్ తప్పేమీ లేదని డాక్యుమెంట్లు తెలియజేస్తున్నాయి. రెడ్ సిగల్స్ను దాటేందుకు అనుమతించారని, అయితే ఆటోమేటిక్ సిగలింగ్ వ్యవస్థ ఫెయిలవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంతర్గత…
రెండు లోక్ సభ నియోజకవర్గాల నుండి గెలుపొందిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకోనున్నట్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి నుంచి ఎంపీగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. తాను రాజీనామా చేస్తున్న వాయనాడ్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, తన సోదరి ప్రియాంకాగాంధీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఎంపీ రాహుల్గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, మరో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ఇటీవల రాహుల్గాంధీ గెలిచిన రెండు ఎంపీ స్థానాల్లో దేన్ని వదులుకోవాలనే విషయంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆ నిర్ణయాన్ని మీడియాకు ఖర్గే ప్రకటించారు. యనాడ్ స్థానాన్ని వదులుకున్నప్పటికీ అక్కడి ప్రజలతో తన…
ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సోమవారం ప్రాజెక్ట్ ను సందర్శించి, సమీక్ష నిర్వహించిన ఆయన ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతోందని చెప్పారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూరదృష్టితో పోలవరం ముంపు ప్రాంతంలోని తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయించామని చంద్రబాబు గుర్తుచేశారు. నాటి ఎన్డీయే-2 కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయగలిగామని చంద్రబాబు ప్రస్తావించారు. అప్పటికే పోలవరం ప్రాజెక్టు చాలా సంక్షోభాల్లో ఉందని, 2005లో వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టు పనులపై అప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని చెప్పారు. ఇక డ్యామ్ ఎత్తు 45.72 మీటర్ల డ్యాం ఎత్తు ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, ఆ ఎత్తును…
పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెళ్తున్న ట్రాక్లోకి వచ్చిన గూడ్స్ రైలు.. వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టంతోనే ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు ఢీకొట్టడంతో కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక బోగీ అయితే ఏకంగా గాల్లోకి లేచి నిలబడింది. ఈ ఘటనలో 15మంది మరణించారు. మరో 60మంది గాయపడ్డారు. అయితే.. ఈ రైలు ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద తీవ్రత భారీగానే ఉందని అధికారులు గుర్తించారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించగా.. ప్రమాద కారణాలను అన్వేషిస్తున్నారు. బెంగాల్ రైలు ప్రమాదానికి ప్రధాన కారణం సిగ్నల్ జంప్ అని రైల్వే శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.…
కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధమైన సగం వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని న్యాయవాదులకు, అధికారులకు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు, ట్రైబ్యునళ్లలో ఉన్న అంశాలపై మంత్రి ఆదివారం హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీలో 75శాతం నమ్మకమైన నీటి లభ్యత కింద 2130టిఎంసీలను లెక్కతేల్చి ఈ నీటిని మూడు రాష్ట్రాలకు కేటాయించింది. మహారాష్ట్రకు 585టిఎంసీలు, కర్ణాటకకు 734టిఎంసీలు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811టిఎంసీల నీటిని పంపిణీ చేసింది. ఈ నీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగినంత కాలం రాలయసీమ , ఆంధ్రపాంతానికి 66శాతం , తెలంగాణ ప్రాంతానికి 34శాతం నీటి పంపిణీ జరిగింది. ఈ లెక్కన ఏపికి 512టిఎంసీల నీటివాటా దక్కగా , తెలంగాణ ప్రాంతానికి కేవలం 299టిఎంసీలే…
చిన్నతనంలోనే హింస, ద్వేషం వంటి అంశాలు బోధించి విద్యార్థుల మెదళ్లను పాడు చేయొద్దని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ పేర్కొన్నారు. ద్వేషం, హింస పాఠ్యాంశాలు కావని, వాటిపై దృష్టి పెట్టకూడదని స్పష్టం చేశారురు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో మార్పులు చేసి విడుదల చేసింది. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్లో ముస్లింల ఊచకోత, హిందుత్వ రాజకీయాలు వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. అయితే ఇది సాధారణ సిలబస్ మార్పుల్లో భాగమేనని అధికారులు వెల్లడించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కావాలనే మోదీ సర్కార్ ఇలాంటివి చేస్తోందని.. చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయకుండా అడ్డుకుంటోందని మండిపడుతున్నాయి. పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో బాబ్రీ కూల్చివేత ప్రస్తావన ఉన్న పుస్తకంలో 3 చోట్ల మార్పులు చేయాలని నిర్ణయించారు. బదులుగా రామమందిర ఉద్యమాన్ని చేర్చారు. …
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరతపై రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓ వైపు నీటి సమస్యపై జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. సమస్యలపై బీజేపీ నిరసనలను తీవ్రతరం చేసింది. ఆదివారం ఛతర్పూర్ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో జల్బోర్డు వద్ద నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. దేశ రాజధానిలో నీటి సంక్షోభంపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు వద్దకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వివాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ద్వారక జిల్లా పాంత్రంలో సాధారణ కుళాయి నీళాయి వద్ద నీరు పట్టుకునే విషయంలో వివాదం చోటు చేసుకోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఇందిరాగాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈశాన్య ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ మనోజ్…