కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ ఒకటో తేదీన జైలు నుంచి విడుదల కాగలరని భావిస్తున్నారు. 1988లో జరిగిన రోడ్డు ఘటనకు చెందిన కేసులో అతను ప్రస్తుతం పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సిద్దూ ట్విట్టర్ అకౌంట్లో ఆయన టీమ్ ఈ విషయాన్ని పోస్టు చేసింది.
శనివారం సిద్ధూ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. జైళ్ల అదనపు డిజిపి ఎ చంద్రశేఖ జైలు నుండి విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి నిర్ధారించారు. వాస్తవానికి రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆయనకు అప్పుడు క్షమాభిక్ష లభించలేదు.
రోడ్డుపై దాడి చేసిన కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. జనవరిలో విడుదల అవుతాడని భావించారు. కానీ సిద్దూ విడుదల ఆలస్యమైంది. జైలు ఫ్యాక్టరీలో పనిచేసినందుకు 60 రోజులు, సత్ప్రవర్తన కలిగి ఉన్నందుకు 30 రోజుల జైలు జీవితాన్ని తగ్గించనున్నారు.
ఆ ఆధారంగానే శిక్షా కాలానికి ముందగానే సిద్దూను విడుదల కాగలరని భావిస్తున్నారు. రెమిషన్ ఏ విధంగా ఇవ్వాలన్న దానిపై సమాలోచనలు జరుగుతున్నాయని, ఇంకా తుది నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పలేమని పాటియాలా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మంజిత్ సింగ్ తివానా అంతకు ముందు తెలిపారు.
59 ఏళ్ల నవజోత్ 1988లో ఓ రోడ్డు మీద గొడవపడ్డాడు. ఆ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష పడింది. గత ఏడాది మే 20న సిధు పాటియాల కోర్టు ముందు లొంగిపోయారు. దానికి ముందు సుప్రీంకోర్టు ఆయనకు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. నాడు జరిగిన రోడ్డు గొడవలో 65 ఏళ్ల గుర్నామ్ సింగ్ చనిపోయాడు.
గత ఏడాది మే 20వ తేదీ నుంచి ఆయన జైలులో ఉంటున్నారు. ఆయనకు 45 రోజుల రెమిషన్ దొరికినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది మే 16న సిద్దూ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది.