ఉగ్రవాదులకు ఎంఐఎం పార్టీ ఆశ్రయం కల్పిస్తోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గతంలో ఉగ్రవాదులకు మద్దతుగా వారికి న్యాయసహాయం చేస్తామని ఓ వైసీ మాట్లాడారని గుర్తు చేశారు.
పాతబస్తీలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారని, ఇందులో ఓ వ్యక్తి ఓవైసీ చెందిన కాలేజీలో హెచ్ వోడీగా పనిచేస్తున్నాడని తెలిపారు. అలాగే ఉగ్రవాదులకు పాతబస్తీ అడ్డాగా మారిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాద సంస్థలను ఎంఐఎం వాడుకుంటోందని ధ్వజమెత్తారు.
ఓట్ల కోసం ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ వాడుకుంటోందని సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు అధికారమే కావాలని, ప్రజల భద్రత అవసరం లేదని మండిపడ్డారు. నిన్న అరెస్ట్ అయిన హిజ్జు ఉత్ తహరీర్ (హెచ్ యు టి) సంస్థ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా ప్రమాదకరం అని సంజయ్ హెచ్చరించారు.
రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం స్రుష్టిస్తున్న సంస్థ. ఒంటరిగానే ఎవరిపైనైనా దాడులు చేసి కలకలం స్రుష్టిస్తున్న సంస్థ ఇది. ఇట్లాంటి ప్రమాదకరమైన సంస్థకు హైదరాబాద్ షెల్టర్ జోన్ గా మారడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.
పాతబస్తీలో రోహింగ్యాలకు షెల్టర్ జోన్ గా మారిందని తాము అనేక సందర్భాల్లో చెబుతూనే ఉండగా, ఇయాళ నిజమైందని తెలిపారు. నిన్న పట్టుబడ్డ హెచ్ యూటీ ఉగ్రవాది మహ్మద్ సలీం డెక్కన్ మెడికల్ కాలేజీలో హెచ్ ఓడీగా పనిచేస్తున్నడని, ఈ కాలేజీ అధినేత ఒవైసీ అని చెప్పారు.
హైదరాబాద్ లోని ప్రజల ప్రాణాలు బాంబుల మీదున్నాయని అంటూ హైదరాబాద్ ప్రజల భద్రతను బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని దయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని చెబుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బండి హెచ్చరించారు.