బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ భారతీయమే.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘1990లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.
`అందుకోసమే పాస్పోర్ట్కు అప్లరు చేశా. అప్పుడే కెనడా పాస్పోర్ట్ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలోనే పాస్పోర్ట్ విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా’ అని అక్షయ్ వివరించారు.
అయితే భారత్ పాస్ పోర్ట్ లేకపోవడంతో విమర్శలు తలెత్తడంతో 2019లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆయనకు పాస్ పోర్ట్ లభించడంతో తీవ్ర జాప్యం జరిగింది.