మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని పేర్కొంటూ వారి ఆగ్రహం ఈ ఎన్నికలలో బైటపడిన్నట్లు ప్రధాని విపక్షాలపై విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాలనలో ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. మూడు రాష్ట్రాల గెలుపు గ్యారంటీతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని కులాలు, ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఓటేశారని మోదీ తెలిపారు. పేపర్ లీక్, రిక్రూట్మెంట్ స్కామ్లపై యువతలో అసంతృప్తి రావడం వల్లే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ప్రభుత్వాలను గద్దె దింపారని విమర్శించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని పేర్కొన్నారు.
దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారని చెప్పారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని కులాలు, ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఓటేశారని మోదీ తెలిపారు.
పేపర్ లీక్, రిక్రూట్మెంట్ స్కామ్లపై యువతలో అసంతృప్తి రావడం వల్లే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ప్రభుత్వాలను గద్దె దింపారని విమర్శించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని తెలిపారు. దేశంలోని యువత అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసినవారిని తరిమికొట్టారని పేర్కొన్నారు ప్రధాని మోదీ. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు.