ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పాన్ మసాలా ప్రచారం కోసం విమల్ ఇలాచీ యాడ్లో నటించినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ యాడ్లో అక్షయ్ తోపాటు ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ అజరుదేవగణ్, షారుఖాన్ కూడా నటించారు. ఈ యాడ్లో అక్షయ్ కుమార్ నటించినందుకు సోషల్మీడియాలో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి.
దీనికి అక్షయ్ కుమార్ స్పందించి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో.. ‘నేను ఈ యాడ్లో నటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఇక ముందు ఇలాంటి యాడ్ల్లో నటించను’ అని హామీ ఇచ్చారు.
ఇటీవల ఆయన చేసిన ఓ పాన్ మాసాలా యాడ్ ఎంతోమంది సినీ అభిమానులతోపాటు నటుడి అభిమానులకి కోపం తెప్పించింది. అదే పాన్ మాసాలా ప్రొడక్ట్ అయినా దీంతో సోషల్ మీడియాలో వీపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా ఈ ప్రకటన విషయంపై అభిమానులకి క్షమాపణలు తెలుపుతూ ఈ హీరో ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటనను విడుదల చేశారు.
‘నన్ను క్షమించండి. నేను నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజులుగా పాన్ మసాలా ప్రకటనపై మీ స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఆమోదించలేదు, ఆమోదించను. విమల్ ఇలాచ్చితో నేను కలిసి పనిచేయడంపై మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను’ అని తెలిపారు. `నేను వెనక్కి తగ్గానని ఎంతో వినయంగా చెబుతున్నాను. అందుకే.. ఈ యాడ్కి సంబంధించి నేను తీసుకున్న పారితోషికాన్ని ఏదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను’ అని వెల్లడించారు.
అయితే, `ఈ యాడ్స్ చేస్తానని ఒప్పుకున్నందుకు చట్టపరమైన నిబంధనలకు లోబడి బ్రాండ్ ప్రకటనల్లో నటిస్తాను. ఆ తర్వాత అనారోగ్యకరమైన యాడ్స్లో నటించను. యాడ్స్ ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటాను.’ అని పేర్కొన్నారు. అలాగే తన శ్రేయోభిలాషుల నుంచి ఎప్పటికీ ప్రేమను కోరుకుంటూనే ఉంటానని ట్వీట్లో తెలిపారు.
కాగా, భారత పౌరులు పొగాకునకు దూరంగా ఉండి, ఆరోగ్యంగా ఉండాలని పేర్కొంటూ తనకు అలాంటి ప్రకటనలే వస్తే వాటిల్లో నటించనని గతంలో అక్షయ్ కుమార్ చెప్పారు. దీంతో తాజాగా విమల్ ఇలాచీ యాడ్ను గతంలో గుట్కా వల్ల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందనే అక్షరుకుమార్ చెప్పే వీడియోను నెటిజన్లు పోస్ట్ చేశారు. ప్రధానంగా ఈ రెండు వీడియోలను టార్గెట్ చేస్తూ, అక్షయ్ కుమార్ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో అక్షయ్ కుమార్ క్షమాపణలు చెప్పే పరిస్థితి వచ్చింది.