ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారంటూ అరెస్టు చేసిన గుజరాత్ ఎమ్మెల్యే జిగేష్ మేవానీకి అలా బెయిల్ మంజూరైందో లేదో, మరో కొత్త కేసులో సోమవారం ఆయన్ను తిరిగి అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీపై ట్వీట్ల కేసులో బెయిల్ పిటిషన్పై ఆదివారం విచారణ చేపట్టిన అసోం కోర్టు తీర్పు రిజర్వు చేయగా, సోమవారం బెయిల్ను మంజూరు చేసింది.
వెంటనే మరో కొత్త కేసులో మేవానీని అరెస్టు చేశారు. మేవానీని అరెస్టు చేసేందుకు వచ్చిన అసోం బార్పేట పోలీసులు, ఏ కేసులో అరెస్టు చేశారనేది ఇంకా వెల్లడించలేదు. మోదీపై చేసిన ట్వీట్స్కు సంబంధించి అసోంకు చెందిన బిజెపి నేత ఫిర్యాదుతో గురువారం గుజరాత్లోని పాలంపూర్ నుండి మేవానీని అరెస్టు చేశారు. అనంతరం అసోంకు తరలించారు.
కాగా, బెయిల్పై విడుదలైన మేవానీ మాట్లాడుతూ.. ‘ ఇది బిజెపి, ఆర్ఎస్ఎస్ల కుట్ర. నా ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేస్తున్నారు. ఓ క్రమపద్ధతిలో కుట్ర జరుగుతుంది. రోహిత్ వేముల, చంద్రశేఖర్ ఆజాద్లకు ఇలానే చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు’ అని మేవానీ విలేకరులతో వ్యాఖ్యానించారు.
తిరిగి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో పోలీసులు చెప్పకపోయినప్పటికీ పోలీస్ అధికారులపట్ల దురుసుగా ప్రవర్తించినందుకు అని అతనిపై నమోదైన కేసులో వివిధ సెక్షన్లు తెలుపుతున్నాయి.