వరుసగా రెండు సార్లు అస్సాం పోలీసులు అరెస్ట్ చేసినా కోర్ట్ నుండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీ మరోసారి గురువారం అరెస్టయ్యారు. ఐదేళ్ల క్రితం జరిపిన ‘అజాదీ మార్చ్’ కేసులో మేవానీ సహా తొమ్మిది మందిని దిగువ కోర్టు నిందితులుగా పేర్కొంది.
2017 జులైలో బనస్కాంత జిల్లాలోని మెహసానా నుండి ధనేరా వరకు మేవానీతో పాటు తొమ్మిది మంది ఆజాది మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి తీసుకోలేదని, చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిర్వహించారంటూ వారిని దోషులుగా నిర్థారించింది. దీంతో వీరందరికీ మూడు నెలల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యిరూపాయల జరిమానా విధించింది.
గత ఏప్రిల్ నెలలో మేవానీని అస్సోం పోలీసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారంటూ అస్సోం పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన వెంటనే మహిళా కానిస్టేబుల్ను వేధించారంటూ మరోసారి అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండో కేసులో గతవారం బెయిల్ లభించగా శనివారం విడుదలయ్యారు. ఉనా కేసులో దళితులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని లేకుంటే జులై 1న రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో కేంద్రాన్ని హెచ్చరించారు.