ఢిల్లీలోని అక్బర్ రోడ్, హుమయూన్ రోడ్, తుగ్లక్ రోడ్ల పేర్లను మార్చాలని బిజెపి కోరింది. ముస్లిం పాలనను సూచించే ఈ రహదారుల పేర్లను మార్చాలని ఢిల్లీ బిజెపి చీఫ్ అదేష్ గుప్తా న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డిఎంసి)కి లేఖ రాశారు.
తుగ్లక్ రోడ్ను గురు గోవింద్ సింగ్ మార్గ్గా, అక్బర్ రోడ్ను మహారాణా ప్రతాప్ రోడ్గా, ఔరంగజేబ్ లైన్ను అబ్దుల్ కలామ్ లైన్గా, హుమయూన్ రోడ్ని మహర్షి వాల్మీకి రోడ్గా, షాజహాన్ రోడ్ని జనరల్ బిపిన్ రావత్గా, బాబర్ లైన్ని స్వాతంత్య్ర సమరయోధుడు ఖుధీరామ్ బోస్గా మార్చాలని ఆ లేఖలో సూచించారు.
ఈ మార్పుల ప్రతిపాదనను ఎన్డిఎంసి పానెల్ ఆమోదించింది. చరిత్ర, సెంటిమెంట్ ఇతర అంశాలను గుర్తించాల్సి వుందా అనే అంశాలనుపరిగణలోకి తీసుకుని పేర్లను మార్చాలని నిబంధనలు సూచిస్తున్నాయి. 2014 బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి ఉత్తరప్రదేశ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో పలు పేర్లు మార్చడం జరిగింది.
మరోవంక, ఢిల్లీలోని కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్గా మార్చాలంటూ హిందూ సంఘం ఒకటి మంగళవారం ధర్నా చేపట్టింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మహాకల్ మానవ్ సేవా ప్రాంతంలో ఈ సంఘం నినాదాలు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా భారీగా పోలీసులు మోహరించారు. అంతేకాదు నిరసనల సమయంలో కొందరు హనుమాన్ చాలీసా పఠించినట్లు తెలుస్తున్నది.