దక్షిణ కశ్మీర్కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే ఈ ఘటన వెలుగుచూసింది.
ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్ కుల్గాం ప్రాంతంలోని గోపాల్పురా గ్రామం ఉన్న ప్రభుత్వ పాఠశాలలోకి దూరి మరీ ఉపాధ్యాయురాలిని గాయపరిచారు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె చనిపోయింది. ఆ లేడీ టీచర్ను రజనీ (36)గా గుర్తించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఆమె జమ్మూలోని సాంబ నివాసి.
ఇదిలావుండగా కశ్మీర్ పండిత్ ఉద్యోగి రాహుల్ భట్ను అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే ఈ ఘటన చోటుచేసుకుంది.
అదే విధంగా వారం కిందట టీవీ నటి అమ్రీన్ భట్ను సైతం ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. ఇదిలా ఉంటే ఈ నెలలో ఉగ్రదాడుల్లో ఇది ఏడో మరణం. ముగ్గురు పోలీస్ సిబ్బందికాగా, నలుగురు పౌరులు మరణించారు.
ఇది కశ్మీర్లో సాధారణ స్థితి నెలకొంది అన్న బిజెపి వాదనను తప్పని రుజువు చేసిందని కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు.
కాగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా ఈ హత్యను విషాధం అంటూ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ కూడా చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరారు.