జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది చివరలో నిర్వహించే అవకాశముందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం సూచనప్రాయంగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం జమ్ముకాశ్మీర్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.
జమ్ములోని పహల్గామ్ రిసార్ట్లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ వింటర్ స్పోర్ట్స్లోని హిమాలయన్ మ్యూజియాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్లో పునర్వవిభజన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని, కాశ్మీర్లో 47 స్థానాలు, జమ్ములో స్థానాలు 43 నుంచి 90కి పెరిగాయని చెప్పారు.
‘ఈ ఏడాది చివరికల్లా జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. సైనిక భద్రతా సంసిద్ధతను సమీక్షించేందుకు జమ్ముకాశ్మీర్లో పర్యటిస్తున్న రాజ్నాథ్ కల్నల్ కెఎస్మాల్ బౌల్డర్ క్లైంబింగ్ వాల్ను కూడా ప్రారంభించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.
అలాగే, దేశంలోని ప్రీమియర్ పర్వతారోణ సంస్థ యొక్క కార్యనిర్వాహక మండలి, జనరల్ బాడీ సమావేశాల్లోనూ మంత్రి పాల్గన్నారని చెప్పారు. కేంద్ర మంత్రితోపాటు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాల్గొన్నారు. గురువారం ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని జవాన్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.