Author: Editor's Desk, Tattva News

విద్యార్థుల రిపోర్ట్ కార్డ్‌ను విజిటింగ్ కార్డ్‌గా పరిగణించవద్దని తల్లిదండ్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీలో సోమవారం జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు. భార‌త భ‌విష్య‌త్తును తీర్చిదిద్దేది విద్యార్థులే అని, మ‌న విద్యార్థులే మ‌న భ‌విష్య‌త్తును నిర్దేశిస్తార‌ని ప్రధాని పేర్కొన్నారు. జీవితంలో పోటీ, సవాళ్లు సాధారణమే అని.. వాటిని ఛాలెంజింగ్‌గా తీసుకుని ముందుకుసాగాలని చెప్పారు. స్నేహితుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని తెలిపారు. “మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి. అది వారి భవిష్యత్తుకు హాని కలిగించవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డును విజిటింగ్ కార్డుగా భావిస్తారు. ఇది మంచిది కాదు. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు” అని ప్రధాని వారించారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలని చెబుతూ…

Read More

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్ పై ఉన్నారని చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. ఒకే ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులంతా బెయిల్ పై…

Read More

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. గడచిన మూడు రోజులుగా రేట్లలో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. మూడు రోజుల కిందట అమాంతం క్రూడ్ ఆయిల్ రేట్లు 3 శాతం మేర పెరిగాయి. దీనికి కొనసాగింపుగా నేడు సైతం చమురు ధరలు అంతర్జాతీయంగా 1 శాతం మేర పెరుగుదలను నమోదు చేశాయి.  ప్రధానంగా అమెరికా ఎకానమీ బలం పుంజుకోవటం, ఎర్ర సముద్రంలో పెరుగుతున్న దాడుల వల్ల ఉద్రిక్తతలు, రష్యాలోని ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి వంటి అనేక కారణాలు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడ్ చమురు రేటు 83 డాలర్ల నుంచి 84.38 డాలర్లకు పెరిగింది. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎర్ర సముద్ర మార్గంలో హౌతీలు చేస్తున్న క్షిపణి దాడి మెర్స్క్ నౌకలను వెనక్కి వెళ్లేలా చేస్తున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. ఇది…

Read More

మూడు కొత్త క్రిమినల్ న్యాయ చట్టాల ఆమోదంతో భారత్ న్యాయ, పోలీసింగ్, నేరపరిశోధన వ్యవస్థలు నవ శకంలోకి అడుగు పెట్టాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సభలో ప్రధాని మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చట్టాలను ఆధునికీకరిస్తోందని తెలిపారు. ‘వందల ఏళ్ల నాటి చట్టాల నుంచి కొత్త చట్టాల అమలులోకి మారడం ముఖ్యం. ఈ విషయంలో మేము ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ, సత్తా పెంపు పనిని ఇప్పటికే ప్రారంభించాం’ అని మోదీ తెలియజేశారు. ఇతర భాగస్వామ్య వర్గాల శక్తి పెంపు దిశగా కృషి చేయవలసిందిగా సుప్రీంకోర్టుకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ‘సాధికార న్యాయ వ్యవస్థ ‘వికసిత్ భారత్’లో భాగం. విశ్వసనీయ న్యాయ వ్యవస్థ ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం నిరంతరం పని చేస్తోంది. పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. జన్ విశ్వాస్ బిల్లు ఆ దిశగా వేసిన ఒక అడుగు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థపై అనవసర…

Read More

స్వదేశంలో ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో భారత్‍కు షాక్ ఎదురైంది. తొలి టెస్టులో ఇంగ్లిష్ జట్టు చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది.  శుభ్‌మన్ గిల్(0), శ్రేయస్ అయ్యర్(13) వైఫల్యం భారత ఓటమని శాసించింది. 231 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన భారత్ 202 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(39), కేఎస్ భరత్(28), అశ్విన్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్‌లీ(7/62) ఏడు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జోరూట్, జాక్ లీచ్ తలో వికెట్ తీశారు. టెస్ట్‌ల్లో ఉప్పల్ మైదానం వేదికగా భారత్‌కు ఇదే తొలి పరాజయం. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2న వైజాగ్ వేదికగా…

Read More

టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తనను రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన నిర్ణయం ప్రకటన సమయంలో జయదేవ్ ఎమోషనల్ అయ్యారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనను కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు టార్గెట్ చేసాయని ఆరోపించారు.  రాజకీయాల్లో ఉంటే తన పని తాను చేయలేకపోతున్నానని వాపోయారు. కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో ఇబ్బంది అని మౌనంగా ఉండలేనని చెప్పారు. రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.  అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని’ గల్లా జయదేవ్ స్పష్టంచేశారు. ఏపీలో పరిశ్రమల విస్తరణకు ఇబ్బందులు కలిగాయని చెప్పుకొచ్చారు. అందుకనే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొల్పామని, విదేశాల్లో పరిశ్రమలను విస్తరిస్తున్నామని వివరించారు.  రాజకీయాల్లో నుంచి వైగొలిగే పరిస్థితి వస్తుందని అనుకోలేదని వాపోయారు. తాను…

Read More

బిహార్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన మహాఘటబంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది. అంతకు ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు లేఖ సమర్పించిన తర్వాత నితీష్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.వరుసగా కూటమిలను మార్చడంలో దేశంలోనే దిట్టగా పేరొందిన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్ కుమార్ ఆదివారం మరోసారి పదవికి రాజీనామా చేసి, తిరిగి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరి తాజాగా ప్రభుత్వం ఏర్పాటు…

Read More

భారత రాజ్యాంగాన్ని రచించిన వారికి రాముడి పాలనే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిపాలన ఎలా ఉండాలనేది, ప్రజా సంక్షేమంపై పాలకులు ఎలా శ్రద్ధ పెట్టాలనే విషయాలకు రామ రాజ్యమే చక్కటి ఉదాహరణ అని తెలిపారు.  ఆదివారం ‘మన్ కీ బాత్’ లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో సీతారామ లక్ష్మణుల చిత్రాలకు రాజ్యాంగ నిర్మాతలు స్థలం కేటాయించారని గుర్తుచేశారు. తీవ్ర మేధోమథనం తర్వాతే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, మూడో భాగంలో పౌరుల ప్రాథమిక హక్కులను వివరించారని తెలిపారు. అయోధ్యలో ఇటీవల జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని యావత్ దేశం ఓ పండుగలా జరుపుకుందని కొనియాడారు. దేశ విదేశాల్లోనూ రామ నామం మార్మోగిందని, వసుధైక కుటుంబం అనే భావనను ప్రజలు చాటారని వెల్లడించారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రజలందరి మాటల్లో, మదిలో రాముడే ఉన్నాడని మోదీ చెప్పారు.…

Read More

వారణాసిలోని జ్ఞానవాపి స్థలంలో దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ నివేదిక నిర్ధారించడంతో మసీదును తగిన ప్రదేశానికి మార్చాలని, అధికారికంగా హిందువులను అక్కడ పూజలకు అనుమతించాలని విశ్వహిందూ పరిషత్డిమాండ్ చేసింది.‘జ్ఞానవాపీ మసీదును గౌరవప్రదంగా మరొక సరైన ప్రదేశానికి మార్చడానికి, కాశీ విశ్వనాథ అసలు స్థలాన్ని హిందూ సమాజానికి అప్పగించడానికి అంగీకరించాలని మేము ఇంతేజామియా కమిటీని కోరుతున్నాం’ అనివీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  మసీదు ప్రాంతంలో దేవాలయం ఉందన్న ఏఎస్ఐ నివేదిక ప్రకారం వాజుఖానా వద్ద బయటపడిన శివలింగానికి పూజలు చేయడానికి హిందూ సమాజాన్ని అనుమతించాలన్న తమ డిమాండ్‌ను ప్రార్థనా స్థలాల చట్టం 1991 సమర్థిస్తుందని అలోక్ కుమార్ తెలిపారు. వాజుఖానా అని పిలిచే శివలింగ నిర్మాణం మసీదు లక్షణాన్ని కలిగి లేదనడంలో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాంగణంలో బయటపడిన శాసనాలలో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి పేర్లను బట్టి ఇది ఆలయమని చెప్పడానికి సాక్ష్యం’ అని…

Read More

తుంటి ఎముక గాయం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫామ్ హౌస్ లో గాయపడిన కేసీఆర్ గత రెండు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ గాయం కారణంగా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే ఫిబ్రవరి 1వ తేదీన స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఛాంబర్ లో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. తాజాగా పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కూడా అయ్యారు కేసీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దాదాపు 3 గంటలపాటు ఈ భేటీ జరిగింది. ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు బలంగా గళం వినిపించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, త్వరలోనే తాను కూడా ప్రజల మధ్యకి వస్తానని చెప్పారు. తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల…

Read More