ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 17 నెలల జైలు జీవితం తర్వాత సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో ఐదు నెలలుగా జైలులో ఉన్న బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితకు సహితం త్వరలో బెయిల్ లభించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వారం రోజులలో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆమె సోదరుడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు జోస్యం చెప్పారు. ముఖ్యంగా సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు చేసిన వాఖ్యలు ఆమెకు బెయిల్ లభించేందుకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించకుండా ఎంతకాలం జైలులో ఉంచుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతే కాకుండా ఏ ఈకేసులో అవసరమైన సాక్ష్యాలు సంబంధించిన పత్రాలు అన్నింటినీ దాదాపుగా దర్యాప్తు సంస్థలు సేకరించడంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. అరెస్ట్…
Author: Editor's Desk, Tattva News
కాలేజీ క్యాంపస్లో హిజాబ్, బుర్కా, నిఖాబ్ ధరించకూడదంటూ చెంబూరు కళాశాల జారీ చేసిన సర్క్యులర్పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ముంబయిలోని ఎన్జి ఆచార్య, డికె మరాఠే కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కళాశాల విధించిన షరతులపై జస్టిస్ సంజీవ్ఖన్నా, సంజరుకుమార్ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కాలేజీ యాజమాన్యం వాదనలపై జస్టిస్ సంజీవ్ఖన్నా ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థుల పేర్లు మతాన్ని బహిర్గతం చేయడం లేదా? నెంబర్స్ ద్వారా వారిని గుర్తించమని అడుగుతారా? అంటూ జస్టిస్ సంజరుకుమార్ ప్రశ్నించారు. కాలేజీ తరపు సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ ఇది ప్రైవేట్ సంస్థ అని చెప్పగా.. కాలేజీ ఎప్పటి నుంచి పని చేస్తుందని జస్టిస్ సంజరుకుమార్ ప్రశ్నించారు. 2008 నుంచి కళాశాల ఉనికిలో ఉందని చెప్పగా.. ఇన్నాళ్లు మీరు ఎందుకు సూచనలు చేయలేదు? అని అడిగారు. మతాన్ని…
రాజ్య సభలో మరోసారి చైర్మన్ జగదీప్ ధన్కర్, ఎంపీ జయా బచ్చన్ ల మధ్య వాగ్వాదం చెలరేగింది. గురువారం చైర్మన్ తనతో, ఇతర విపక్ష సభ్యులతో ఆమోదయోగ్యం కాని రీతిలో మాట్లాడారని, అది సరికాదని, ఆయన బాడీ లాంగ్వేజ్ తమను అవమానించేలా ఉందని జయా బచ్చన్ సభలో విమర్శించారు. దాంతో, ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ ఆగ్రహంగా ‘‘జయా బచ్చన్ జీ.. మీరు సెలబ్రిటీ అయి ఉండవచ్చు.. ఐ డోంట్ కేర్.. ఎవరైనా సభలో సభా మర్యాదలు పాటించాల్సిందే’’ అని స్పష్టం చేశారు. దాంతో, సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉపరాష్ట్రపతి, రాజ్య సభ చైర్మన్ తనతో ఆమోదయోగ్యం కాని రీతిలో మాట్లాడారని, అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని నటి, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఆరోపించడంతో జయాబచ్చన్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ల మధ్య వారం వ్యవధిలో మరోసారి…
జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచాడు. క్వాలిఫయర్ రౌండ్ లో టాప్లో నిలిచి గోల్డ్ మెడల్పై ఆశలు రేకెత్తించాడు నీరజ్. ఫైనల్లో క్వాలిఫయర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసిన గోల్డ్ మెడల్ మాత్రం దక్కలేదు. సిల్వర్ మెడల్తోనే సరిపెట్టుకున్నాడు. సిల్వర్ మెడల్ గెలవడం ద్వారా వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకం సాధించిన మూడో ఇండియన్ అథ్లెట్ గా నీరజ్ చోప్రా నిలిచాడు. గతంలో రెజ్లింగ్లో సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్లో పీవీ సింధు వరుసగా రెండు ఒలింపిక్స్లలో పతకాల్ని సాధించారు. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు. గురువారం అర్థరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా 89.45 దూరం జావెలిన్ను విసిరాడు. ఫైనల్లో ఐదు సార్లు జావెలిన్ను విసరడంలో నీరజ్ విఫలమయ్యాడు. రెండో ప్రయత్నంలోనే జావెలిన్ను 89.45 దూరం విసిరి పతకం ఖాయం చేశాడు.ఆ తర్వాత నీరజ్ ప్రయత్నాలన్నీ ఫౌల్…
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భ ట్టాచార్య వృద్ధాప్య సమస్యలతో గురువారం కోల్కతాలోని స్వగృహంలో ఉద యం 8.30 గంటలకు కన్నుమూశారు. 80 ఏళ్ల బుద్ధదేవ్కు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు. ఆమె లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని కుమారుడుగా ఉంటున్నారు. వైద్య పరిశోధనకు ఆయన భౌతిక కాయం దానం ఇచ్చినందున ప్రజలు అంతిమ నివాళి అర్పించిన తరువాత శుక్రవారం ఆస్పత్రికి తరలిస్తారని సిపిఎం రాష్ట్రకార్యద ర్శి మొహమ్మద్ సలీం చెప్పారు. 2000 నుంచి 2011 వరకు రాష్ట్రముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ పరిపాలించారు. 2011 ఎన్నికలలో ఆయన పార్టీ నేతృత్వం లోని 34 ఏళ్ల లెఫ్ట్ఫ్రంట్ ప్రభు త్వం పరాజయం పొందింది. దాంతో బుద్ధదేవ్ తన రెండు గదుల ఇంటికే పరిమితమై రాజకీయాలకు దూరమయ్యారు. చూపు మందగించి ఊపిరితిత్తుల వాధితో బాధపడుతున్నారు. శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందుతున్నారు. కోల్కతా లోని ప్రెసిడెన్సీ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన బుద్ధదేవ్ రాజకీయాల్లోకి రాకముందు…
రిజర్వేషన్ల కోటా కారణంగా చెలరేగిన హింసతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వానికి సారధిగా నోబెల్ అవార్డ్ గ్రహీత ముహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం తన విధులను నిబద్దతతో చేస్తానని యూనస్ పేర్కొన్నారు. రాజ్యాంగ రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి 9.20 గంటల సమయంలో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్, మహ్మద్ యూనస్చేత తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత కేబినెట్ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి 16 మంది సభ్యులతో సలహా మండలిని ప్రకటించారు. విద్యార్ధి నాయకులు నహిద్ ఇస్లామ్, అసిఫ్ మహ్మద్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరారు. బంగాభవన్ అధ్యక్ష భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిఎన్పి, బంగ్లాదేశ్ జమాత్ ఇ ఇస్లామి…
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం గెలుచుకుంది. టీమ్ ఈవెంట్లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. స్పెయిన్పై 2-1 తేడాతో గెలుపొంది పతకాన్ని తన ఖాతాల్లో వేసుకుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు షూటింగ్లో 3 కాంస్య పతకాలు రాగా.. తాజాగా హాకీ జట్టు మరో పతకం సాధించింది. సెమీఫైనల్స్లో తుది వరకు పోరాడి 2-3 తేడాతో జర్మనీపై ఓడిపోయిన భారత్ గురువారం కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్లో స్పెయిన్పై విజయం సాధించింది. రెండో సెట్ ప్రారంభంలో మొదటి గోల్ సాధించి స్పెయిన్1-0 అధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్ ఆఖరి నిమిషంలో భారత్ మొదటి గోల్ చేసి స్కోర్ను 1-1తో సమం చేసింది. ఇక మూడో సెట్ ప్రారంభంలో ఆట 33వ నిమిషంలో మరో గోల్ చేయడంతో భారత్ 2-0 అధిక్యంలోకి వెళ్లింది. సింగ్ హరమన్ప్రీత్ భారత్ తరపున రెండు…
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ), దాని అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఒలింపిక్ గ్రామంలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ భవిష్యత్తును నాశనం చేసేలా ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆమె తరపు కౌన్సిల్ గురువారం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఫలితంగా భారత్ బంగారు పతకాన్ని కోల్పోయిందని వినేశ్ ఫోగట్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా పేర్కొన్నారు. డబ్ల్యుఎఫ్ఐకి ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీపై గతేడాది డిసెంబర్లో క్రీడాశాఖ మంత్రి సస్పెండ్ వేటు వేయడమే ప్రధాన కారణమని వినేశ్ ఫోగట్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్ అనర్హత వేటుకి గురైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో డబ్ల్యుఎఫ్ఐకి నిర్వహించిన ఎన్నికలు చట్టవ్యతిరేకమని, స్పోర్ట్స్ కోడ్ను పాటించనందున కమిటీని పక్కన పెట్టాలంటూ రెజ్లర్లు బజరంగ్పూనియా, వినేశ్ ఫోగట్ సహా పలువురు ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్…
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. లోక్సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు అమలు అవుతున్న వక్ఫ్ చట్టానికి కీలక సవరణలు చేసే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. అయితే ఈ బిల్లును అమల్లోకి తీసుకురావడం ద్వారా.. వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతోపాటు ముస్లిం మహిళలను, ముస్లిమేతరులనూ.. ఈ వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేసేలా తయారు చేశారు. ఇక ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో.. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ – జేపీసీకి పంపిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 1995 లో అమలులోకి వచ్చిన ఈ వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకురావడం ద్వారా.. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా వక్ఫ్…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఎస్ఆర్సీ రిపోర్టు రాకుండానే వైఎస్ జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసిందని మండిపడ్డారు. జగన్ ఓడిపోయాడు.. కానీ చావలేదని స్వయంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని.. ఇలాంటి పరిస్థితుల్లోనే సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్లామని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూటమి నేతలు విచిత్రమైన ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్కు ఎక్కువ భద్రత ఉన్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేశారని చెబుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 986 మంది సెక్యూరిటీ ఉన్నారని ప్రచారం చేశారని గుర్తుచేశారు. అప్పట్లో జగన్కు ఉన్నది కేవలం 139 మంది సెక్యూరిటీనే అని స్పష్టం చేశారు. నారా లోకేశ్ కూడా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. 10 మంది సాయుధ గార్డులతో…