యూజర్లకు భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బీఎస్ఎన్ఎల్) త్వరలో శుభవార్త చెప్పనున్నది. బీఎన్ఎస్ఎల్ 4జీ నెట్వర్క్ను ప్రారంభించబోతున్నది. ఆగస్టు నాటికి సేవలను లాంచ్ చేయనున్నది. గతంలోనూ 4జీ సేవలు ప్రారంభంపై వార్తలు వచ్చినా.. తాజాగా సంస్థ 4జీ ప్లాన్స్ను సైతం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్లాన్ వివరాలను వెల్లడించింది. ప్లాన్స్.. ప్రయోజనాలు.. PV2399 : ఈ బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్ 395 రోజుల వాలిడిటీతో వస్తున్నది. ఈ ప్లాన్తో ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అలాగే నిత్యం 2జీబీ డేటా పొందవచ్చు.PV1999 : ఈ ప్లాన్ 600GB డేటాతో పాటు 365 రోజుల చెల్లుబాటు అవుతుంది. 100 ఉచిత ఎస్ఎంఎస్లు సైతం వస్తాయి. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది.PV997 : బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.997 ప్లాన్లో చేరితో ప్రతిరోజూ 2జీబీ డేటాతో…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు వేశాయి. ఈ సమస్యల పరిష్కారానికిగాను రెండు రాష్ట్రాలు కలిసి రెండు కమిటీలను నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీని వేయనున్నారు. ముందుగా చీఫ్ సెక్రటరీలతో ఉన్నతస్థాయి అధికారుల కమిటీని నియమిస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీతో కలిపి ముగ్గురేసి అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. అప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించకపోతే.. ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని నియమించాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో ఆమోదం తెలపాలన్న నిర్ణయానికి వచ్చారు. అపరిష్కృతంగా ఉన్న ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014’లోని విభజన అంశాలపై శనివారం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు…
ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు శనివారం ప్రకటించారు. ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను జులై 23న లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన ఆమె.. 2024-25 బడ్జెట్ను సమర్పించనున్నారు. అయితే, వరుసగా ఆరుసార్లు బడ్జెట్లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ని అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడితే.. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్…
ఈ నెల 2వ తేదీన హథ్రాస్ జిల్లాలో సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో వందలాది మంది మృతి చెందారు. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దేవ్ ప్రకాష్ మధుకర్ ఈ ఘటన జరగబోయే కొద్దిరోజుల ముందు కొన్ని రాజకీయ పార్టీల నేతలతో టచ్లో ఉన్నట్లు తన కాల్ రికార్డ్ చెక్ చేస్తే తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఈ ఘటన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, దేవ్ప్రకాష్ మధుకర్ని శుక్రవారం రాత్రి ఢిల్లీలోని నజాఫ్గడ్ ప్రాంతంలో హథ్రాస్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అరెస్టు చేశారు. హథ్రాస్ తొక్కిసలాట ఘటన జరగబోయేముందు కొన్ని రాజకీయ పార్టీలు దేవ్ ప్రకాష్ని సంప్రదించాయని హథ్రాస్ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిపున్ అగర్వాల్ తెలిపారు. …
ఉత్తర్ ప్రదేశ్లోని హత్రాస్లో తొక్కిసలాట ఘటనకు కారకుడైన జగత్ గురు సకారి విశ్వహరి అలియాస్ భోలే బాబా ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గత మంగళవారం సత్సంగ్ పేరుతో ఆయన నిర్వహించిన సమావేశంలో ఆయన పాదధూళి కోసం జనం ప్రయత్నించడం తొక్కిసలాటకు దారితీసి 123 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న భోలే బాబా కోసం పోలీసులు వెదుకుతున్నారు. కానీ, ఆయన మాత్రం ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత మీడియాకు ఓ వీడియోను విడుదల చేయగా.. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. ‘తొక్కిసలాట ఘటన చాలా విచారకరం… ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. దయచేసి ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై నమ్మకం ఉంచండి. గందరగోళం సృష్టించిన వారు ఎవరైనా విడిచిపెట్టరని నాకు నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా నిలవాలని, జీవితాంతం…
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ మోటారు సైకిల్ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తదితరులు మార్కెట్లో బజాజ్ ఫ్రీడమ్ 125 మోటారు సైకిల్ను ఆవిష్కరించారు. బజాజ్ ఫ్రీడమ్ 125 అనే పేరుతో బజాజ్ ఆటో ఆవిష్కరించిన ఈ సీఎన్జీ మోటార్ సైకిల్ ధర రూ.95,000 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. సీఎన్జీ మోడ్లో కిలో సీఎన్జీ గ్యాస్ పై 120 కి.మీ, పెట్రోల్ మోడ్లో లీటర్ పెట్రోల్పై 65 కి.మీ మైలేజీ ఇస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 మోటారు సైకిల్ మూడు వేరియంట్లు – డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ వేరియంట్లలో లభిస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 మోటారు సైకిల్ 125సీసీ ఇంజిన్తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 9.5 పీఎస్ విద్యుత్, 9.7…
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు నిన్నమొన్నటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్న కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. దీంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోవటమే పెద్ద దెబ్బ అనుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేని స్థాయికి చేరుకోవటం తేరుకోలేని దెబ్బగా భావిస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిరాయింపులతో పార్టీని ఎలా కాపాడుకోవాలని తలపట్టుకుంటున్న వేళ ఆయనకు మరో తలనొప్పి మొదలైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. “ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం” అంటూ పోస్టులు పెట్టగా అది పరోక్షంగా తనను ఉద్దేశిస్తూనే పెట్టారంటూ మంత్రి సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే బీఆర్ఎస్ అధికారిక హ్యాండిల్ కావటంతో ఆ పోస్టుకు పార్టీ అధినేత కేసీఆర్ను బాధ్యుడిగా పరిగణిస్తూ…
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే నీట్ పరీక్షను రద్దు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి.. సుప్రీంకోర్టులో తాజాగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని.. అందుకే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇప్పుడు నీట్ పరీక్షను రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్ధులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. నీట్ అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపిన కేంద్రం.. ప్రశ్నాపత్రం లీకేజీ నిందితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. నీట్ పరీక్షను రద్దు చేయడం అంటే కష్టపడి చదివి.. నిజాయతీగా పరీక్ష రాసిన విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసినట్లే అవుతుందని స్పష్టం చేసింది. ఎలాంటి పోటీ పరీక్షలనైనా.. పారదర్శకంగా నిర్వహించేందు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తేల్చి…
ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగిందని పేర్కొంటూ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పాటు డిల్లీ పర్యటన లో ఉన్న ఆయన ప్రదానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలసి ఎపికి చేయూత ఇవ్వవలసిందిగా కోరారు. ఇక పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరుతున్న సమయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి.. కృష్ణా గోదావరి నదులు రాష్ట్రం గుండా వెళ్తున్నాయి.. ఒక్క గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతుంది.. ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి నీటిని ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి…
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడి ఆస్తులు, విలాసవంతమైన జీవితం గురించి ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతుంది. ఓ జాతీయ మీడియా వెల్లడించిన నివేదిక ప్రకారం.. నిత్యం తెల్లటి సూటు, బూట్లు, టై, నల్ల కండ్లద్దాలతో కనిపించే భోలే బాబా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకూ ఉంటుంది. కాస్గంజ్, ఆగ్రా, కాన్నూర్, గ్వాలియర్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్ హరి సాకార్ ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట వీటిని నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు. ఇక భోలే బాబా సూరజ్పాల్ మెయిన్పురిలోని విలాసవంతమైన…