జమ్మూకాశ్మీర్లో బుధవారం రాత్రి వరుస దాడులకు ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీవీ నటిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు.
బూద్గామ్ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్ చేసి కాల్పులకు తెగబడ్డారు. కాగా, బుధవారం రాత్రి.. ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్ భట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్ జుబీర్కు కూడా బుల్లెట్ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన ఫర్హాన్ జుబైర్(10) అనే బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడకు అయిన బుల్లెట్ గాయం వల్ల అమ్రీన్ ఆస్ప్రతికి వచ్చే దారిలోనే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.
ఇక, అమ్రీన్ మేనల్లుడు ఫర్హాన్ చేతికి బుల్లెట్ గాయమవ్వగా వైద్యులు చికిత్స చేస్తున్నారు.ఇదిలా ఉండగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్చలు చేపట్టినట్టు తెలిపారు.
కాగా, జమ్ము కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో మరణించారు. ఈ ఘటనలో ఓ పోలీసు కూడా వీర మరణం పొందారు. బారాముల్లా జిల్లాలోని క్రీరీ ప్రాంతం నజీభట్ క్రాసింగ్లోని ఓ చెక్పోస్టు వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది.
మరోవైపు.. 24గంటల వ్యవధిలోనే కశ్మీర్లో మరో ఉగ్రదాడి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం శ్రీనగర్లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు.