రాజోలుకు చెందిన వైసీపీ కీలక నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో ఆదివారం చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గత రెండు ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బొంతు రాజేశ్వరరావు జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేయగా.. జనసేనలో చేరుతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. తన అనుచరుల సలహాలు, జనసేన నేతల నుంచి ఆహ్వానం రావడంతో.. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావుతో విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గురాన అయ్యలు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి కొండలరావు జనసేన కండువా కప్పుకున్నారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు అన్యాయం…
Author: Editor's Desk, Tattva News
బ్రిటన్ లో భారత్కు చెందిన నర్స్ గా పనిచేస్తున్న ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. లండన్ సమీపంలోని నార్తంప్టన్ ప్రాంతంలో కెట్టెరింగ్లో ఉన్న తమ అపార్ట్మెంట్ భవనంలో కత్తిపోటు గాయాలతో ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు. కేరళకు చెందిన అంజు (42), ఆమె ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేగింది. అంజు అక్కడకక్కడే చనిపోగా.. ఆ పిల్లలిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కేరళలోని కొట్టాయం నుంచి బ్రిటన్కు వెళ్లిన అంజు తన భర్త సజు, ఆరేళ్ల బాబు, నాలుగేళ్ల పాపతో కలిసి ఉంటోంది. పిల్లలు సహా అంజు హత్యకు గురికావడంతో ఆమె భర్త సజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సజు శరీరంపై కూడా స్వల్ప గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. కుమార్తె హత్యకు గురైన విషయం తెలిసి కొట్టాయంలోని అంజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంజును ఉరేసి చంపినట్టు పోస్ట్మార్టంలో వెల్లడైనట్టు…
వచ్చే సంవత్సరం కల్లా దేశంలోని ప్రతి గ్రామానికి హై స్పీడ్ బ్రాడ్బాండ్ కనెక్షన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ టెలికం సంస్థ బీఎన్ఎన్ఎల్ ప్రతి గ్రామానికి 4జీ సర్వీస్లను అందించడంతో పాటు, బ్రాడ్బాండ్ నెట్ కనెక్షన్లను ఇస్తామని టెలికం శాఖ కార్యదర్శి కే. రాజారామన్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ మౌలికసదుపాయలు కల్పించేందుకు వీలుగా కాంట్రాక్ట్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ కాంట్రాక్ట్లన్నీ చివరి దశలో ఉన్నాయని చెప్పారు. 2040 నాటికి వంద శాతం డిజిటల్ చెల్లింపులు జరపాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలోనూ హై స్పీడ్ బ్రాడ్బాండ్ సర్వీస్లను అందిస్తామని పేర్కొన్నారు. 2017లో చైనా జనాభాలో 50 శాతం మంది మాత్రమే మన దేశంలో డిజిటల్ చెల్లింపులు చేశారని, ప్రస్తుతం ఇది చైనా జనాభా కంటే రెట్టింపు అయ్యిందని టెలికం శాఖ సహాయ మంత్రి చెప్పారు. బీఎస్ఎన్ఎల్ వచ్చే సంవత్సరంలో అన్ని గ్రామాల్లో 4జీ సర్వీస్లను ప్రారంభించడంతో పాటు,…
మన రాజ్యాంగం నైతిక విద్యకు సంబంధించిన డాక్యుమెంట్ వంటిదని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ శనివారం తెలిపారు. మన సమాజంలో నైతిక ప్రవర్తనను సృష్టించడానికి రూపొందించిన పత్రమని చెప్పారు. ”మన రాజ్యాంగం ప్రజల కోసం ఉద్దేశించలేదు. ప్రజలు ఎలా వుండాలో చెప్పేందుకు నిర్దేశించివుంది. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగమే దిక్సూచి. దైనందిన జీవితానికి మార్గదర్శి” అని ఆయన పేర్కొన్నారు. మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశారు 90వ జయంతి సందర్భంగా ముంబయిలో ఆయన సార్మకోపన్యాసం చేశారు. ”మేం అన్యాయాన్ని సరిదిద్దాం. సెక్షన్ 377 అనేది గత శకంలోని నైతికతపై ఆధారపడింది. రాజ్యాంగ నైతికత వ్యక్తుల హక్కులపై కేంద్రీకరిస్తుంది. సమాజంలో ఆదరణ పొందిన నైతిక భావనల నుండి దానిని రక్షిస్తుంది.” అని ఆయన తెలిపారు. ”ప్రగతిశీల రాజ్యాంగం విలువలనేవి మనకి ఒక మార్గనిర్దేశక శక్తిగా పనిచేస్తాయి. మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు రాజ్యాంగం నుండి దూరంగా మళ్లరాదని అవి చెబుతాయి.” అని జస్టిస్ చంద్రచూడ్…
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఢిల్లీలో అమరావతి రైతులు నినాదాలు చేశారు. ఎపికి మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలంటూ శనివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒకే రాజధాని కోరుతూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో తమ డిమాండ్లను బలంగా వినిపించారు. ధరణికోట టూ ఎర్రకోట పేరుతో ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్న రైతులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జై అమరావతి అంటూ నినాదించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఢిల్లీలో మూడు రోజుల నిరసనలకు పిలుపునిచ్చిన రైతులు. తొలిరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించగా, ఆదివారం కేంద్ర పెద్దల్ని కలిసి అమరావతి సమస్యను వివరిస్తున్నారు. మూడో రోజు సోమవారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో వారు బహిరంగ సభ నిర్విహంచబోతున్నారు. అమరావతి రైతుల ధర్నాకు టిడిపి, జనసేన, కాంగ్రెస్, సిపిఎ పార్టీల నేతలు…
పాపికొండలు సందర్శించే పర్యాటకులకు ఏపీ పర్యాటక శాఖ కొత్త టారిఫ్లు ప్రకటించింది. వేర్వేరు పర్యాటక ప్రాంతాల నుంచి పాపికొండలు సందర్శించే పర్యాటకుల కోసం ఒక రోజు, రెండు రోజుల ప్యాకేజీ ప్రకటించడంతో పాటు వారికి అందించే సౌకర్యాలను సైతం స్పష్టం చేసింది. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటనకు పెద్దలకు రూ.1,250, పిల్లలకు రూ.1,050 కాగా రెండు రోజుల పర్యటనకు పెద్దలకు రూ.3000, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. పోచవరం నుంచి పాపికొండలు ఒకరోజు సందర్శనకు పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750. ఇక, రెండు రోజుల ప్యాకేజీగా పెద్దలకు రూ. 2,500, పిల్లలకు రూ.2000, గండిపోచమ్మ గుడి నుంచి పాపికొండలు వెళ్లే పర్యాటకులకు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800 కాగా రెండు రోజుల పర్యటనకు పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2000గా పర్యాటక శాఖ పేర్కొంది. రాజమండ్రి నుంచి ఉదయం 7.30గంటల నుంచి సాయంత్రం 7.30గంటలకు, పోచవరం నుంచి ఒక రోజు పర్యటన ఉదయం 9.30గంటల…
పఠాన్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని ఒక వంక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా . బేషరమ్ రంగ్.. పాట చూడటానికి చాలా అసభ్యకరంగా ఉందని, మన సినీ ఇండస్ట్రీ అస్తవ్యస్థంగా మారిందని బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా మండిపడ్డారు. ఇతరుల ఫీలింగ్స్ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అశ్లీలత ఎక్కువైందని పేర్కొంటూ నటీనటుల్ని ఇప్పుడు పొట్టి పొట్టి దుస్తుల్లో చూపించిన ఫిల్మ్మేకర్స్.. రాబోయే రోజుల్లో బట్టలు లేకుండా చూపిస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలను ఇబ్బంది కలగకుండా సినిమాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుదని ముఖేష్ స్పష్టం చేశారు. యువతను ప్రేరేపించే, తప్పుదోవ పట్టించే చిత్రాలను సెన్సార్ బోర్డు అనుమతివ్వకూడదని చెప్పారు. ఇదేమీ ఓటీటీ కోసం చేసిన పాట కాదని, సినిమా కోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసభ్యకరంగా ఉన్నప్పటికీ సెన్సార్…
వైసిపి, టిడిపి శ్రేణులు ఘర్షణకు దిగడంతో పల్నాడు జిల్లా మాచర్ల భగ్గుమన్నది.టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరింత రెచ్చిపోయి, వైసిపి కార్యకర్తలు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటితోపాటు ఆఫీసుకు, నాయకుల వాహనాలకు నిప్పు పెట్టారు. టిడిపికి చెందిన మరో ఇద్దరు నాయకుల ఇళ్లను కూడా దగ్ధం చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాని స్థితిలో పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు 144వ సెక్షన్ విధించారు. మాచర్లలో హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత…
నరేంద్రమోదీపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అనుచిత వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందువుగా నిలుస్తున్నదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ప్రధాని మోదీ లక్ష్యంగా భుట్టో వ్యక్తిగత దూషణకు దిగారు. ‘బిన్లాడెన్ చనిపోయాడు. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడు. అతడే భారత ప్రధాని మోదీ’ అని వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు పాక్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడింది. బిన్ లాడెన్ను అమరుడిగా కీర్తించిన దేశం పాక్ అని, జకీర్ రెహ్మాన్ లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీం లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్నదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ ధ్వజమెత్తారు. భుట్టో వ్యాఖ్యలు పాకిస్థాన్ మరింత దిగజారుడుతనానికి నిదర్శనమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి పిచ్చి…
జాతీయ రాజకీయాలలో ఇక చక్రం తిప్పబోతున్నానని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తన కొత్త జాతీయ పార్టీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి, అక్కడ నాలుగు రోజులున్నప్పటికీ ఎవ్వరు పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీల నాయకులు అక్కడే ఉన్నారు. ఎన్నికల సమయంలో నిధులు సమకూరుస్తారనో, మరో కారణం చేతనో మాజీ ముఖ్యమంత్రులు హెచ్ డి కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ కార్యాలయ పారరంభంకు వచ్చారు. మిగిలిన పార్టీల నాయకులు ఎవ్వరు కనీసం శుభాకాంక్షలు కూడా తెలిపిన దాఖలాలు లేవు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంతో సన్నిహితుడిగా భావిస్తారు. ఆయన పార్టీ వారెవ్వరూ కూడా కేసీఆర్ ను పలకరించిన దాఖలాలు లేవు. ఇక, గతంలో స్వయంగా వెళ్లి కేసీఆర్ పలకరించిన మమతా బెనర్జీ, శరద్ పవర్, నితీష్ కుమార్ వంటి నేతలు లేదా వారి ప్రతినిధులు కూడా కేసీఆర్ ను పట్టించుకోలేదు. నిత్యం ఆయనను కలవడం కోసం జనం క్యూ…