బిజెపి బలహీనమయితే ఎప్పటికైనా తానే ప్రధాని కాగలననే అమిత విశ్వాసంతో ఏకపక్ష ధోరణులతో వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శాపంగా ఉన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలే వాపోతున్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఖచ్చితంగా పంజాబ్ లో గెలుపొంది, తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్న సమయంలో కేవలం రాజకీయంగా నిలకడలేని నవజ్యోత్ సింగ్ సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి, సుదీర్ఘకాలం కాంగ్రెస్ కు బలమైన నేతగా ఉన్న కెప్టెన్ అమరిందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేటట్లు చేశారు. అమరిందర్ సింగ్ మరో పార్టీ పెట్టి, బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకోవడం, సిద్దు కొత్త ముఖ్యమంత్రితో కూడా సఖ్యతతో ఉండక పోవడంతో ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ మూడో లేదా నాలుగో స్థానంకు దిగజారడం ఖాయంగా కనిపిస్తున్నది. అంతకు ముందు మధ్య ప్రదేశ్, కర్ణాటక వంటి…
Author: Editor's Desk, Tattva News
దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య 470 కి పైగా దాటిపోయింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు వస్తున్నాయి. నిన్న అక్కడ మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసులు 110కి చేరుకున్నాయి. రాజస్థాన్లో కొత్తగా 21, మహారాష్ట్రలో 2, కేరళలో 1, గుజరాత్ లో 6, కర్ణాటకలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న, వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతున్న 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను ఇవాళ పంపనుంది కేంద్ర వైద్యశాఖ. రాష్ట్రాల ఆరోగ్య శాఖతో కలసి మల్టీ డిసిప్లినరీ టీమ్స్ పనిచేస్తాయని అధికారులు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్, సర్వీలెన్స్, కంటెయిన్మెంట్ ఆపరేషన్స్, టెస్టింగ్, కరోనా అప్రాప్రివియేట్ బిహేవియర్, హాస్పిటల్ బెడ్స్ లభ్యత, ఆంబులెన్స్, వెంటిలేటర్స్, మెడికల్ ఆక్సిజన్ లాంటివి అందుతున్నాయా..? లేదా అనే విషయాలతో పాటు… వ్యాక్సినేషన్ ప్రోగ్రెస్ ను సెంట్రల్ టీమ్స్ పరిశీలించనున్నాయి. కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను…
హిందూ దేవతల పట్ల అవమానకరంగా వాఖ్యలు చేస్తున్న వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారూఖీని కేటీఆర్ తెలంగాణకు ఆహ్వానించడంతో వివాదం చెలరేగుతుంది. కేటీఆర్ తీరు పట్ల బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గమ్మ వారిని, సీతమ్మ వారిని, శ్రీరామ చంద్రుడిని అవమానించిన మూర్ఖుడిని కేటీఆర్ రాష్ట్రానికి ఆహ్వానించడం దారుణం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కామెడీ షోలను సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదనీ, రాజకీయ కారణాల వల్ల తాము మునావర్ షో వంటివి క్యాన్సిల్ చేయలేమని అంటూ మంత్రి కెటి రామారావు ఓ కార్యక్రమంలో చేసిన వాఖ్య కలకలం రేపుతున్నది. తాము ప్రభుత్వంపై ఎవరు చేసే విమర్శలనైనా స్వాగతిస్తామని, ప్రతి ఒక్కరూ హైదరాబాద్కు రావాలనీ తమది అచ్చమైన కాస్మొపాలిటన్ సిటీ అని స్పష్టం చేశారు. దీంతో బెంగళూరులో నిరసనల నేపథ్యంలో రద్దయిన మునావర్ సిటీలో షో నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. గుజరాత్కు చెందిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ దేశంలోనే…
దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గత రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు (ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని ప్రకటించారు. క్రిస్మస్, వాజ్పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలను హెచ్చరించారు. డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి కూడా అదనపు డోసు ఇస్తారని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే…
“మధ్యాహ్నం 12 గంటలకు మేల్కొనే వారు యువకులు కాదు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన వారు, వ్యాక్సిన్ను వ్యతిరేకించిన వారు యువకులు కాదు. వీరు అలసిపోయిన, పదవీ విరమణ చేసిన వ్యక్తులు. వారి నుండి ఏమీ ఆశించవద్దు” అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష నేతలను ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకు కోటి టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాజపేయి జయంతి సందర్భంగా, ఆయన పేరున గల లక్నో స్టేడియంలో 60,000 మందికి పైగా విద్యార్థులకు పరికరాలను పంపిణీ చేయడం ద్వారా ఈ డ్రైవ్ను ప్రారంభించారు. విద్యార్థులలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన వారు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. మహమ్మారి సమయంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత స్పష్టంగా కనిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు. పిల్లలకు ఆన్లైన్ విద్య, తరగతుల సౌకర్యం లేనందున కోటి మంది…
పంజాబ్లో జరిగిన బాంబుపేలుడు ఘటనకు కారకుడుగా భావిస్తున్న మాజీ హెడ్కానిస్టేబుల్కు ఖలిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర డిజిపి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. ఈ ఘటన వెనకాల పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారు ఉన్నట్టుగా అనుమానాలున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, కచ్చితమైన ఆధారాలు ఇంకా లభించలేదని చెప్పారు. ఈ నెల 23న లూధియానా జిల్లాకోర్టు సముదాయంలోని రెండో అంతస్థులో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని 2019లో సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన హెడ్కానిస్టేబుల్ గగన్దీప్సింగ్గా గుర్తించారు. కోర్టు సముదాయంలో బాంబు పెట్టేందుకు గగన్దీప్ ప్రయత్నిస్తున్న క్రమంలోనే అది పేలిపోయినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది మానవబాంబు ఘటన కాదని, బాంబును ఓ చోట అమర్చే ప్రయత్నంలో అది పేలడం వల్ల గగన్ మరణించాడని దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఆ సమయంలో అతడు అక్కడి వాష్రూంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడే ఓచోట బాంబును వైర్లతో అమర్చేందుకు…
మాజీ ప్రధాని, బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఓ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. “భారతదేశాన్ని నిరంతరం ఫస్ట్ ప్లేస్లో ఉంచేందుకు కృషి చేస్తున్న పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక సూక్ష్మ విరాళాల కార్యక్రమాన్ని ప్రారంభించాం” అని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. “మీరు అందించే చిన్న మొత్తాలే.. రేపటి దేశ భవిష్యత్తుకు పెద్ద బలాన్ని అందిస్తాయి” అని నడ్డా ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఈ రోజు డిసెంబర్ 25, అటల్ జీ జన్మదినం నుంచి ఫిబ్రవరి 11 వరకు అంటే దీన్ దయాళ్ జీ పుణ్య తిథి వరకు, బీజేపీ ప్రత్యేక సూక్ష్మ విరాళాల కార్యక్రమం జరగనుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు అందించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం కావడానికి దోహదపడాలని విజ్ఞప్తి చేసారు. దీంతో దేశాన్ని ఎల్లప్పుడూ అత్యుత్తముగా ఉంచడంలో బీజేపీ కృషి చేస్తుందని ఆయన…
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్లను తగ్గించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరుమలలో మాత్రం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే బ్లాక్లో 3 వేలకు టికెట్లు అమ్ముతోందని శ్రీపీఠం వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఆగంతుకుల చేతుల్లో దెబ్బతిన్న దేవాలయాలను నిర్మించకపోతే తాను ప్రత్యక్షంగా తిరుమల నుంచి తాడేపల్లి వరకు పాదయాత్ర చేస్తానని ఆయన హెచ్చరించారు. డెల్టా వైరస్ విజృంభిస్తోందని చెప్పి హిందువుల పండగలైన దేవీనవరాత్రులు, గణపతి నవరాత్రులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలను విధించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఒమైక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్ పండగకు, జనవరి వేడుకలకు ఆంక్షలు విధిస్తారా లేదా చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. హిందువులు దేవాలయాలకు వెళ్లొద్దని, హిందువులు ఊరేగింపులు, పూజలు చేసుకోవద్దంటూ కేవలం హిందువుల పండలకే ప్రభుత్వం ఆంక్షలు పెడుతోందని, మిగతా వారికి కరోనా సోకదనే అభిప్రాయం సీఎం జగన్కు ఉన్నట్లుందని ఆయన విమర్శించారు. …
బంగ్లా యుద్ధం – 101971 యుద్దానికి ముందు, యుద్ధం సమయంలో కూడా పాకిస్తాన్ సైనికాధికారుల ప్రవర్తనను యుద్ధం తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం నియమించిన వార్ కమీషన్ తూర్పురా బట్టింది. ఈ సందర్భంగా సైన్యం, దేశ నాయకత్వం వ్యవహరించిన తీరును సిగ్గుమాలినదిగా అభివర్ణించింది. వారిని దుర్మార్గం, స్మగ్లింగ్, యుద్ధ నేరాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించింది. వార్ కమీషన్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్పై బహిరంగ విచారణకు సిఫారసు చేసింది, వారు మొదట ఈ పరిస్థితికి బాధ్యత వహించాలని, వారు పోరాడకుండానే లొంగిపోయారని స్పష్టం చేసింది. అయితే బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పాకిస్థాన్ ప్రభుత్వం సాహసింపలేదు. యుద్ధం ముగిసిన తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం బెంగాలీయుడైన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి హమూదుర్ రెహమాన్ నేతృత్వంలో యుద్ధ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయమూర్తులు ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. యుద్ధంలో ఓటమికి కారణమైన ఇంటెలిజెన్స్, వ్యూహాత్మక, రాజకీయ,…
* నేడు మాలవీయ జయంతి భారతదేశపు మొట్ట మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ ఏది? బెనారస్ హిందూ యూనివర్సిటీ! దానిని ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు మదన్ మోహన్ మాలవీయ స్థాపించారు. అందుకోసం దేశం అంతా తిరిగి విరాళాలు సేకరించారు. అందుకే ఆయనను చాలామంది “నువ్వు మదన్ మోహన్ మాలవీయవి కావు బాబూ. నువ్వు మనీ మేకింగ్ మెషీన్ వి” అని హాస్యమాడేవారు కూడా. అంత ఓపిగ్గా, పట్టుదలగా ఆయన విరాళాలు సేకరించేవారు. ఇదే క్రమంలో ఆయన హైదరాబాద్ లో నిజాం దగ్గరకి వచ్చారు. నిజాం మహా పిసినారి. పైపెచ్చు మహా మత దురహంకారి. ” నీకెంత ధైర్యం…హిందూ యూనివర్సిటీ కోసం నేను విరాళం ఇవ్వాలా” అంటూ తన చెప్పును విసిరేశాడు కోపంగా. మాలవీయ మారు మాట్లాడలేదు. ఆ చెప్పును కళ్లకద్దుకుని “మహా ప్రసాదం” అంటూ బయటకి వచ్చేశాడు. బాగా రద్దీగా ఉన్న కూడలిలో నిజాం చెప్పుని ఉంచి, దాన్ని అమ్మకానికి పెట్టాడు. నిజాం ప్రభువు చెప్పును కొనేందుకు జనం ఎగబడ్డారు. పోటీ పెరిగింది. వేలం…