మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ మార్పిడితో కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల. ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య , కిరణ్ కుమార్రెడ్డి హయాంలోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వసంత్ కుమార్ పనిచేశారు. రోశయ్య క్యాబినెట్లోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ- కాంగ్రెస్ కలయిక తర్వాత హస్తంపార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు.. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య.. జనసేన అధినేత…
Author: Editor's Desk, Tattva News
పోలవరం డయాఫ్రం వాల్ ఇంజనీరింగ్ నిపుణులకు సవాల్ విసురుతోంది. 2020లో వచ్చిన భారీ వరద ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని కూడా అదుపు చేస్తోంది. డయాఫ్రం వాల్ను పూర్తిగా పునర్నిర్మాణం చేయటమా, దెబ్బతిన్న కట్టడాన్ని తొలగించి అక్కడి వరకే నిర్మాణాన్ని పరిమితం చేయటమా అనేది ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఎన్నో ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థలతో అధ్యయనం చేయించిన కేంద్ర జలశక్తి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (జాతీయ జలవిద్యుత్ బోర్డు – ఎన్.హెచ్.పి.సి) కొత్తగా అందించే నివేదిక మేరకు తుది నిర్ణయం తీసుకోనుంది. వచ్చేనెలలోనే డయాఫ్రం వాల్ నిర్మాణంపై తుది నిర్ణయాన్ని ప్రకటించి ఆ మేరకు పనులను చేపట్టేందుకు అవసరమైన డిజైన్ కు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ)కు మార్గ నిర్దేశం చేసినట్టు తెలిసింది. డయాఫ్రం వాల్ను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం లేదనీ, కట్టడం ఎంత…
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని రూపొందించినవారు భారతదేశంలో వందల సంవత్సరాల బ్రిటీష్ పాలనలో జరిగిన దురాగతాలను ఎందుకు వీడియోలు తీయలేదు?” అని ఆయన బీబీసీని ప్రశ్నించారు.భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బాగా రాణిస్తోందని, దీంతో విదేశీ డాక్యుమెంటరీ నిర్మాతలు నిరాశకు గురయ్యారని ఎద్దేవా చేశారు. న్యాయవ్యవస్థ తీర్పుల కన్నా.. ఆ డాక్యుమెంటరీని నమ్ముతున్న వారిని చూసి తాను చింతిస్తున్నానని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆరిఫ్ ఖాన్.. “ఇది భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన సమయం. ఈ డాక్యుమెంటరీని తీసుకురావడానికి ఈ నిర్దిష్ట సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు?” అని ప్రశ్నించారు. ప్రత్యేకించి భారతదేశం తన స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేదని.. దేశం ముక్కలవుతుందని స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో అంచనా వేసిన వారి నుంచి వచ్చిన డాక్యుమెంటరీ ఇది అంటూ ఎద్దేవా చేశారు. కాగా,…
లండన్లో ఇంటి అద్దెలు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే లండన్వాసులు జీవన వ్యయంతోపాటు, విద్యుత్ ఛార్జీల పెంపుదలతో సతమతమవుతున్నారు. తాజాగా గృహ యజమానులు గతేడాది కంటే ఈ ఏడాది ఇంటి అద్దెలు పెంచడానికి మొగ్గుచూపుతున్నారని టెలిగ్రాఫ్ నివేదిక వెల్లడించింది. లండన్లో గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ. 2,50,000 ఉన్న ఇంటి అద్దె ఈ ఏడాది ప్రారంభంలో 3,000,00 లక్షలకు పెరిగే అవకాశమున్నట్లు టెలిగ్రాఫ్ నివేదిక పేర్కొంది. కాగా, గతేడాది లండన్ కాకుండా.. మిగతా దేశాల్లో ఇంటి అద్దెలు 9.7 శాతం పెరిగాయని న్యూస్ అవుట్లెట్ నివేదించింది. ఇక లండన్లో 2021 తర్వాత ఇంటి అద్దెలు 9.9 శాతంతో రెండవ అత్యధిక వార్షిక వృద్ధిని నమోదు చేసినట్లు న్యూస్ అవుట్లెట్ పేర్కొంది.ఇంటి అద్దెలు విపరీతంగా పెరగడంతో.. అద్దెదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గృహ యజమానులు అద్దెను పెంచే అభిప్రాయాన్ని మార్చుకోవాలని ప్రాపర్టీ సైన్స్…
నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం విద్యార్ధులకు తప్పనిసరి అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీ తల్కటోరా స్టేడియంలో ఆరో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముచ్చడిస్తూ పిల్లలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను ఇవ్వాలని, తద్వారా విజయాలు సాధించేందుకు తోడ్పడాలని విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు. పరీక్షల తర్వాత కూడా జీవితం ఉంటుందని ప్రధాని విద్యార్ధులకు సూచించారు. జీవన ప్రయాణం ఒక్క స్టేషన్ వద్దనే ఆగిపోదని చెబుతూ అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాలని హితవు చెప్పారు. నిరంతరం తోటి విద్యార్ధులతో పోల్చుకుంటూ శాంతిని కోల్పోవద్దన్నారు. సానుకూలంగా ఆలోచించడం ద్వారా మరింత మెరుగైన ప్రదర్శన కనబరచగలరని తెలిపారు. కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయని చెబుతూ ప్రధాని భాషలతో పాటు వారసత్వం, చరిత్ర, సంస్కృతి, నాగరికతల గురించి కూడా అధ్యయనం చేయాలని విద్యార్ధులకు సూచించారు. ఐక్యరాజ్యసమితిలో తమిళ భాష మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆయన భారతదేశంలో అత్యంత…
62 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ తో చేసుకున్న సింధూ జలాల ఒప్పందంను సవరించాలని భారత్ పట్టుబడుతున్నది. ఈ మేరకు పాకిస్థాన్కు భారతదేశం నోటీసు వెలువరించింది. 1960 సెప్టెంబర్ 19 నాటి ఈ పురాతన కీలక ఒప్పందా న్ని అమలు చేయడంలో పాకిస్థాన్ నిరాసక్తతకు నిరసనగా ఈ శ్రీముఖం పంపించారు. ఇండస్ వాటర్ ట్రీటీ (ఐడబ్లుటి)ని సవరించుకుని కొత్తగా రూపొందించుకుందామని ప్రతిపాదించింది. ఇరు దేశాల మధ్య పారే నదీ సంబంధించి అత్యంత కీలకమైన ఈ అంశంపై ఈ నెల 25వ తేదీననే పాకిస్థాన్ ప్రభుత్వానికి సింధూ జలాల సంబంధిత కమిషనర్ల ద్వారా ఈ నోటీసులను పంపారు. ఇంతకాలం అయింది ఒప్పందం అమలు చేయకుండా తాత్సారం చేస్తూ పోతున్నారు. మరి, ఈ క్రమంలో ఒప్పందాన్ని తిరిగి కుదుర్చుకుంటే మంచిదని భారత ప్రభుత్వం సూచించింది. తొమ్మిదేళ్ల పాటు సంప్రదింపుల తర్వాత ఇరు దేశాల మధ్య దశాబ్ధాల క్రితం ఈ నదీజలాల ఒప్పందం కుదిరింది. ఒప్పందం అమలులో…
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ అవమానించిన తీరుపై కేంద్ర హోమ్ మంత్రికి ఓ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఫిర్యాదు చేస్తానని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ వెల్లడించారు. గవర్నర్ను అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని అని స్పష్టం చేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం సిగ్గుచేటని పేర్కొంటూ రాజ్యాంగం పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్చాకరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్, ముఖ్యమంత్రి వంటి పదవులు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినవేనని, వాటికి వచ్చే గౌరవం వ్యక్తిగతమైనదేమీ కాదని హితవు చెప్పారు. గణతంత్ర ఉత్సవాలను నిషేధించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య ఏవైనా ఇబ్బందులుంటే ముఖ్యమంత్రులే కూర్చుని పరిష్కరించుకుంటారు తప్ప గణతంత్ర దినోత్సవాలను బహిష్కరించలేదని చెప్పారు. తమిళనాడులో, ఢిల్లీలో ప్రతిపక్ష ప్రభుత్వాలున్నా…
ఉద్యోగం వచ్చిందని ఎంతో ఉత్సాహంగా సొంతూరు నుంచి అమెరికాకు వెళ్లాడా యువకుడు. పెద్ద ఉద్యోగం చేసి మమ్మల్ని బాగా చూసుకుంటాడని యువకుడి తల్లీదండ్రులు పొంగిపోయారు. కానీ ఎంతో సేపు ఆ సంతోషం నిలవలేదు. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే మృత్యువు అతన్ని కబలించింది. శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఎం సున్నాపల్లి చెందిన రవికుమార్కు ఇటీవల అమెరికాలో ఉద్యోగం వచ్చింది. దీంతో జనవరి 17న కొత్త ఉద్యోగంలో చేరేందుకు అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అక్కడ సీమన్గా ఉద్యోగంలో చేరాడు. ఇంతలో బుధవారం నాడు కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కంటెయినర్ పైనుంచి జారిపడి రవికుమార్ మృతి చెందాడు. రవికుమార్ మృతిపై అతని కుటుంబ సభ్యులకు గురువారం కంపెనీ ప్రతినిధులు సమాచారం చేరవేశారు. దీంతో ఎదిగిన కుమారుడు అంతలోనే అందకుండా పోయినందుకు రవికుమార్…
మహిళల అండర్19 టి20 ప్రపంచకప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇక భారత్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్లు అన్నా బ్రొనింగ్ (1), ఎమ్మా మెక్లాయిడ్ (2) విఫలమయ్యారు. అయితే వన్డౌన్లో వచ్చిన ప్లిమ్మర్ (35), వికెట్ కీపర్ గాజే (26) కొద్ది సేపు పోరాటం కొనసాగించారు. అయితే భారత బౌలర్ పర్శవి చోప్రా అద్భుత బౌలింగ్తో కివీస్ ఇన్నింగ్స్ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. చోప్రా 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. కెప్టెన్ షపాలీ వర్మ 4 ఓవర్లలో ఏడు పరుగులు మాత్రమే…
రేడియో ధార్మిక పధార్థాలు సహా పలు వస్తువులను రష్యాకు ఎగుమతిచేయడంపై జపాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలపై కొత్త ఆంక్షల విధింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ఆర్థిక, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. రేడియోధార్మిక పదార్థాలు, వ్యాక్సిన్లు, వైద్యపరికరాలు, రొబోట్లు, అణుధార్మిక పరికరాలు, చమురు, సహజవాయు అన్వేషణ పరికరాలు, టియర్గ్యాస్, ఫింగర్ప్రింట్ పౌడర్ వంటి వివిధ రసాయనాల ఎగుమతులను నిషేధించనున్నట్లు వెల్లడించింది. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 3 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. అలాగే 49 రష్యన్ కంపెనీలు, సంస్థలపై ఎగుమతి పరిమితులను విధిస్తున్నట్లు పేర్కొంది. క్రిమియా, సెవాస్టోపోల్లను స్వాధీనం చేసుకోవడం, ఉక్రెయిన్లో అస్థిరతకు వ్యతిరేకంగా రష్యాకు చెందిన 22 మంది వ్యక్తుల ఆస్తులను స్తంభింపచేస్తున్నట్లు తెలిపింది. వీరిలో రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా ల్వోవా బెలోవా, ఉప ప్రధానులు ఆండ్రీ బెలౌసోవ్, డిమిత్రి చెర్నిషెంకో, న్యాయమంత్రి, కేంద్ర ఎన్నికల…