మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మూడు గంటలకు తుది శ్వాస విడిచారు. కొద్దినెలల క్రితం మనోహర్ జోషి మెదడులో రక్తస్రావం కారణంగా హిందూజా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా మారితే డిశ్చార్జ్ చేస్తామని ఇటీవల వైద్యులు తెలిపారు. అయితే ఈ సమయంలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో మనోహర్ జోషి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మనోహర్ జోషి 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. శివసేన పార్టీ నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మొదటి నాయకుడు మనోహర్ జోషి కావడం విశేషం. 1937 సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన లా రాయఘడ్ జిల్లాలోని గవిఝలలో పేద కుటుంబంలో జన్మించిన మనోహర్ జోషి, చిన్నతనం నుండే రాజకీయాలపై విపరీతమైన…
Author: Editor's Desk, Tattva News
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంల్లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జన్నత్ హుస్సేన్ మృతిపై పలువురు రాజకీయ నేతలు, అధికారులు సంతాపం ప్రకటించారు. జన్నత్ హుస్సేన్ 1977 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. పలు జిల్లాలకు కలెక్టర్గా, పలు విభాగాలకు కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010 డిసెంబరు 31న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో హుస్సేన్ఉద్యోగ విరమణ చేశారు. సీఎం రోశయ్య హయాంలో సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.. 2014 వరకూ పదవిలోనే ఉన్నారు. నాలుగు దశాబ్ధాలపాటు అధికారిగా తెలుగు ప్రజలకు జన్నత్…
రానున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన క్రమంలో ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశగా చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. ఇరు పార్టీల మధ్య పలు రాష్ట్రాల్లో పొత్తుపై తొందరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు పొత్తులు తప్పనిసరని పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఇప్పటికే ఖరారైంది. ఢిల్లీలో పాలక ఆప్ నాలుగు స్ధానాల్లో కాంగ్రెస్ మూడు స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఇక మరో మూడు రాష్ట్రాల్లోనూ ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని చెబుతున్నారు. ఇక గుజరాత్లో రెండు లోక్సభ స్ధానాల్లో, హరియాణలో ఒక స్ధానంలో ఆప్ పోటీ చేయనుంది. అయితే, పంజాబ్లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండదని ఆప్ అధినేత…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ను దవాఖానకు తరలించారు. ఈనెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో నార్కట్పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఓఆర్ఆర్పై పటాన్చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె…
తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని, ఈ విషయంలో దాపరికం లేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బిజెపితో మాట్లాడుతున్నామని, పొత్తు గురించి త్వరలోనే ప్రకటన ఉంటుందని వెల్లడించారు. కాగా, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతోన్న టీడీపీ, జనసేన పార్టీలు గురువారం జరిపిన సమన్వయ కమిటీ సమావేశంలో తొలి ఉమ్మడి బహిరంగసభను ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరపాలని నిర్ణయించారు. ఈ బహిరంగసభలో రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. టిడిపి – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. పొత్తును స్వాగతించిన టిడిపి -జనసేన కేడర్ను అభినందిస్తూ తీర్మానం చేశారు. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసిందని తెలిపారు. సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొనే ఎన్నికల్లో…
ప్రజాదరణలో ప్రధాని నరేంద్ర మోదీకి తిరుగులేదని మరోసారి రుజువైంది. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మోదీకి ఆదరణ ఉందని తాజా సర్వే తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో మోదీకి అగ్రస్థానం కట్టబెట్టింది. మార్నింగ్ కన్సల్ట్ సర్వే విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో భారత ప్రధాని మోదీ 77 శాతం రేటింగ్తో టాప్లో నిలిచారు. భారత దౌత్య విధానం, కేంద్ర ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. ఈ ఏడాది తొలి క్వార్టర్ కు సంబంధించి సేకరించిన డేటాతో ఈ లిస్టును వెలువరించినట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది. ఆయా దేశాలకు చెందిన పౌరుల అభిప్రాయలను క్రోడీకరించి, వారం రోజుల సగటు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక తయారుచేసినట్లు వెల్లడించింది. మోదీ తర్వాతి స్థానంలో 64 శాతం రేటింగ్ తో మెక్సికో ప్రెసిడెంట్ మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రాడోర్ నిలిచారు. స్విట్జర్లాండ్ ప్రధాని అలైన్ బెర్సెట్ 57 శాతం రేటింగ్తో…
కిరూ హైడ్రోపవర్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన ఆరోపణలపై జమ్మూ కశ్మీరు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్తో నివాసంతోపాటు మరో 29 ఇతర ప్రదేశాలలో గురువారం సిబిఐ సోదాలు నిర్వహించింది. దేశంలోని వివిధ నగరాలలోని 30 ప్రదేశాలలో గురువారం ఉదయం సిబిఐకి చెందిన దాదాపు 100 మంది అధికారులు సోదాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రూ. 2,200 కోట్ల విలువైఔన కిరూ హ్రైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు సివిల్ పనుల కాంట్రాక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఈ పవర్ ప్రాజెక్టుతోపాటు మరో ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లపై సంతకం పెడితే రూ. 300 కోట్ల ముడుపులు ఇస్తామని తనను ప్రలోభ పెట్టినట్లు 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూ కశ్మీరు గవర్నర్గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ గతంలో ఆరోపించారు. 2019లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్ పనుల కాంట్రాక్టును ఒక ప్రవైట్…
వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ `చలో సెక్రటేరియట్ ‘ నినాదంతో ప్రభుత్వంపై తొలి బాణం సంధించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ సచివాలయం ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులుఅడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్పిలుపు మేరకు చలో సచివాలయం నిరసనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుచెప్పటమే కాదు… ఏపీలో ఎక్కడిక్కడే కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేశారు. గిడుగురాజును, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్టు చేయటంతో ఆంధ్రరత్న భవన్ ఎదుట షర్మిల ధర్నాకు దిగారు. కాంగ్రెస్ శ్రేణులు అధికసంఖ్యలో విజయవాడకు చేరుకోగా చలో సచివాలయానికి షర్మిల బయలుదేరారు. ఈ సందర్భంగా విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. అయినా చలో సచివాలయానికి షర్మిల బయలుదేరగా తాడేపల్లిలో పోలీసులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అక్కడ ఆమెను అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్ఆర్…
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఈడీ నుంచి కేజ్రీవాల్కు సమన్లు జారీకావటం ఇది ఏడోసారి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్కు ఈడీ అధికారులు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా మరోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 26వ తేదీన ఏజెన్సీ కార్యాలయంలో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ పేర్కొంది. గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్…
పంట ఉత్పత్తులకు మద్ద తు ధర కోరుతూ మలిదశ ఉద్యమం ప్రారంభించిన రైతులు పోలీసులతో జరిగిన ఘర్షణలో తొలిసారిగా ఓ సహచరుడిని కోల్పోయారు. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతాబలగాలకు రైతులకు జరిగిన ఘర్షణలో ఓ 21ఏళ్ల రైతు శుభ్కరణ్ సింగ్ మృతి చెం దాడు. ఈ ప్రాంతంలోనే పరిస్థితి పూర్తిగా చేయిదాటి రణరంగాన్ని తలపించింది. పంజాబ్ నుంచి త తరలివచ్చిన రైతులను హర్యానా సరిహద్దుల్లోని శంభు, కనౌరీ వద్ద పోలీసులు, భద్రతా బలగాలు అటకాయించారు. దీనిని రైతులు ప్రతిఘటించారు. ముందుకు సాగేందుకు యత్నించారు. దీనితో వీరిని చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు వారిపై భాష్పవాయువు ప్రయోగించారు. పలు భద్రతా వలయాలను ఛేదించుకుంటూ, బారికేడ్లను తీసివేస్తూ రైతులు ముందుకు సాగడంతో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు రణరంగం అయింది. వీరిని నిలువరించేందుకు మధ్యాహ్యానికి మూడు సార్లు భాష్పవాయువు ప్రయోగించారు. ఇక్కడనే టియర్గ్యాస్ ప్రయోగానికి డ్రోన్లను కూడా వాడారు. దీనితో రైతులు భాష్పవాయువు…