తీవ్రవాదమనేది మానవాళికి ఇప్పటికీ అత్యంత తీవ్రమైన ముప్పుల్లో ఒకటిగా వుందని విదేశాంగ మంత్రి జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రవాద నిరోధక కమిటీ (సిటిసి) రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఆవిర్భవిస్తును సాంకేతికతలను ఉపయోగించుకుని తలెత్తుతున్న తీవ్రవాద ముప్పులను ప్రస్తావించారు. ఈ కమిటీ మొదటి రోజు సమావేశం ముంబయిలో జరిగింది. వివిధ దేశాలకు చెందిన మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు ఇంటర్నెట్ను, ద్రోన్లతో సహా మానవ రహిత వైమానిక వాహనాలను, అలాగే నిధుల కోసం క్రిప్టో కరెన్సీని ఇతర ఆన్లైన్ మార్గాలను ఉపయోగించుకోవడంపై చర్చ జరిగింది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతలపై నైపుణ్యాలు సాధించడం ద్వారా తీవ్రవాద గ్రూపులు, వాటి సైద్ధాంతిక అనుచరులు తమ సామర్ధ్యాలను పెంచుకుంటున్నారని జై శంకర్ పేర్కొన్నారు. ఇంటర్నెట్, ఇతర సామాజిక మాధ్యమ వేదికలనేవి తీవ్రవాదులకు, మిలిటెంట్ గ్రూపులకు అత్యంత…
Author: Editor's Desk, Tattva News
భారత దేశం లో పరిశ్రమలు , తయారీ రంగాలను ప్రోత్సహించాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపిచ్చారు. హైదరాబాద్ లో అఖిల భారత వైశ్య ఫెడరేషన్ (ఎఐవైఎఫ్)ను ఉద్దేశించి ప్రసంగించారు. భారత దేశంలో తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆయన కోరారు ఇది ఉపాధిని పెంపొందించడానికి, మన పౌరుల జీవితాలలో సంవృద్ధిని తీసుకురావడానికి దోహద పడుతుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు, పర్యాటకులు తమ ప్రయాణ బడ్జెట్లో కనీసం 5 శాతాన్ని స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులపై ఖర్చు చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మంత్రి సమర్థించారు. ప్రతిభావంతులైన మన చేతివృత్తులవారు, హస్తకళాకారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి అర్హులని మంత్రి చెప్పారు. గత 30 సంవత్సరాలలో భారత దేశ జీడీపీ 11.8 రెట్లు పెరిగిందని గోయల్ వివరించారు. ఒకప్పుడు జనాభాలో అధిక భాగం మందికి ఆహారం, దుస్తులు, నివాస వసతి వంటి జీవితానికి అవసరమైన ప్రాథమిక అవసరాలకు భరోసా…
గుజరాత్ అసెంబ్లీకి కొద్దీ రోజులలో ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ ప్రకటించనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు వెల్లడించారు.శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశం భూపేంద్రపటేల్ నేతృత్వంలోని మంత్రివర్గం చివరి సమావేశంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ ఆమోదం తెలపిన యూసీసీ కమిటీకి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ముగ్గురు లేదా నలుగురు సభ్యులు కమిటీలో ఉంటారని కేంద్ర మంత్రి పరోత్తమ్ రూపాలా తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.
భారతీయ రైల్వేలు మొట్టమొదటిసారి భూటాన్కు బహుళ మార్గాల ద్వారా సరకు రవాణా వాహనాలను అందచేసినట్లు శనివారం అధికారులు తెలిపారు. భూటాన్ కొనుగోలు చేసిన 75 సరకు రవాణా వాహనాలను చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్లోని హసిమర రైల్వే స్టేషన్కు గూడ్సు రైలు ద్వారా రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి వాయువ్య బెంగాల్లోని అలీపూర్దువర్ జిల్లాలోని హసిమర రైల్వే స్టేషన్కు గూడ్సు రైలు చేరుకోగా శనివారం ఉదయం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో భూటాన్కు తరలించినట్లు వారు చెప్పారు. భూటాన్కు గూడ్సు రైలు ద్వారా సరకులు రవాణా చేయడం ఇదే మొదటిసారని, ఆ దేశం నుంచి వచ్చే డిమాండు ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని సరకులను రవాణా చేస్తామని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్కు చెందిన అలీపూర్దువర్ డివిజనల్ రైల్వే మేనేజర్ దిలీప్ కుమార్ సింగ్ తెలిపారు. భూటాన్తో వర్తకం చేయడానికి వూహాత్మకంగా కీలక ప్రాంతమైన హసిమర రైల్వే స్టేషన్ వద్ద మౌలిక…
చక్కెర ఎగుమతులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం పొడగించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు అమలులో ఉంటుంది. దేశీయ మార్కెట్లో ధర పెరుగుతున్న దృష్ట్యా చక్కెర ఎగుమతులను గతేడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిర్ణయం మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తున్నది. చక్కెరతో పాటు గోధుమలపై విధించిన ఎగుమతి నిషేధం కూడా అమలులో ఉన్నది. రికార్డు స్థాయిలో పంచదార ఎగుమతి నేపథ్యంలో ధరలు పెరిగాయి. ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్ద దేశం కాగా, బ్రెజిల్ తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, దుబాయ్ దేశాలు మన వద్ద ఉత్పత్తయ్యే చక్కెరను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది దేశం పెద్ద మొత్తంలో చక్కెరను ఎగుమతి చేసింది. గతేడాది 60 లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా…
ఉగ్రవాదం ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో విస్తరిస్తోందని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ శనివారం తెలిపారు. ‘ఉగ్రవాదం అన్నది మానవాళికి గొప్ప ముప్పు’ అని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రెండు రోజుల ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. కౌంటర్ టెర్రరిజం కమిటీ(సిటిసి) రెండు రోజుల సమావేశానికి భారత్ అధ్యక్షత వహించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం అన్నది భద్రతా మండలి ముఖ్యాంశంగా మారిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నవీన సాంకేతికత ప్రభుత్వాలకు కొత్త సవాళ్లను కూడా విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం ముప్పు పెరుగుతోందని, ఈ జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్య సమితి చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నప్పటికీ, అది విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చారు. ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలకు, రెగ్యులేటరీ వ్యవస్థలకు నూతన సవాళ్లను విసురుతున్నాయని చెబుతూ ఉగ్రవాద నిరోధం లక్ష్యంగా ఆంక్షలను విధిస్తోందని పేర్కొన్నారు. రాజ్యేతర శక్తులు ఉగ్రవాదంలో క్రియాశీలకంగా ఉన్నాయని తెలిపారు. ఇంటర్నెట్, సోషల్…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాజాసింగ్ను పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని కోర్టులో వాదనలు వినిపించారు. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ టీవీల్లో ప్రసంగించారని, వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీడీ యాక్ట్ కింద నిర్బంధించామని తెలిపారు. ఆయన నిర్బంధాన్ని సలహా మండలి కూడా ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఈ నెల 19న జీవో జారీ చేసినట్టు చెప్పారు. మరోవైపు, పిటిషనర్ తరపు న్యాయవాది రామచంద్రరావు తన వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించి నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. దీంతో కల్పిస్తున్న ధర్మాసనం …
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టి) దక్షిణాది క్యాంపస్ ఏర్పాటుతో ట్రేడ్ హబ్గా కాకినాడ దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకపాత్ర పోషించనుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాకినాడ జెఎన్టియు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐఎఫ్టి క్యాంపస్ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అపారమైన ఎగుమతి సామర్థ్యాలతో ప్రాముఖ్యత చాటుతూ విదేశీ వాణిజ్యానికి హబ్గా నిలుస్తున్న కాకినాడలో ఐఐఎఫ్టి ఏర్పాటు ఎంతో సముచితమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎపిలో ఎయిమ్స్, ఐఐఎం, ఐఐఎస్ఇఆర్, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి తదితర పది ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్…
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావే గ్రేట్ మాస్టర్ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్స్ ఆర్ట్స్ లో ప్రఖ్యాత చిత్రకారుడు అక్బర్ సాహెబ్ గీసిన పెయింటింగ్స్ నుప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ డబ్బు ఎరజూపి పార్టీలో చేర్చుకునే నీచ సంస్కృతి బీజేపీలో లేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యవహారాల్లో కేసీఆర్ అందెవేసిన చేయి అని తెలిపారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో బీఎస్పీ, తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండానే చేర్చుకుని, ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని, కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలకు తలా రూ.…
భారత దేశంలో ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని కామన్వెల్త్ దేశాలకు అందించడానికి భారత దేశం ముందుకు వచ్చింది. ఈ పరిణామం పట్ల సెక్రటరీ జనరల్ పట్రిషియా స్కాట్లాండ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప పరివర్తన తీసుకొచ్చే చర్య అని ప్రశంసించారు. 56 దేశాలకు సభ్యత్వం గల కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఈ నెల 12న ఈ ప్రతిపాదనను భారత్ చేసిన్నట్లు ఆయన వెల్లడించారు. పట్రిషియా స్కాట్లాండ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇది గొప్ప దాతృత్వమని కొనియాడారు. తన టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకోవడానికి ఇష్టపడటం వల్ల భారత్ ఇతర దేశాలకు భిన్నమైనదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. భారత దేశం చాలా విశిష్టమైనదని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. టెక్నాలజీని ఇతర దేశాలకు ఇవ్వడానికి ఇష్టపడటం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో…