ఓవైపు అనారోగ్యం, మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో ఓటమి ఛాయలు, ఇంకొకవైపు దేశీయంగా వ్యతిరేకత.. ఇలా వరుస సవాళ్లమధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది. ఈ వైఫల్యాల నుంచి బయటపడేందుకు ఆయన ముందు శక్తివంతమైన ప్రత్యామ్నాయాలేవీ కనబక పోవడంతో ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఎలా బయటకు రావాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. ప్రస్త్తుత దశలో అణ్వస్త్రాలను ఉపయోగించడం లేదా ఓటమిని అంగీకరించడం మాత్రమే ఆయనకు మిగిలిన మార్గాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ ఓటమిని అంగీకరిస్తే, ఫిబ్రవరిలో తన బలగాలు ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతాలను తిరిగి అప్పగించడం అనివార్యమవుతుంది. ఈ సంక్లిష్ట వ్యూహాలు, సమస్యల మధ్య పుతిన్ సంయమనం కోల్పోతున్నాడని క్రెవ్లిున్ వర్గాలు చెబుతున్నాయి. రష్యా సాయుధ బలగాలతోపాటు వేర్పాటువాద యోధులు, పుతిన్ అనుకూల ప్రైవేట్ సైన్యాల్లో మరణించిన వారి సంఖ్య దాదాపు 65,000కు చేరుకుందని ‘అంతర్గత’ సమాచారాన్ని అందించే ప్రతిపక్ష సోర్స్ జనరల్ ఎస్విఆర్…
Author: Editor's Desk, Tattva News
రాయలసీమలో పెట్టుబడులు పెట్టనీయకుండా కొందరు నాయకులే అడ్డుకుంటున్నారని అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరోక్షంగా ధ్వజమెత్తారు. దేశం నుంచి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడుతున్నారని చెప్పారు. “ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే వారికి కప్పం కట్టాలట.. కప్పం కట్టకుంటే కియా పరిశ్రమపై చేసినట్లు దాడి చేస్తారట” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రానిదే రాయలసీమ అభివృద్ధి జరగదని చెబుతూ సీమ వెనకబడిదంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ యువత ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్కు వెళ్తున్నారని గుర్తు చేశారు. దివ్యాంగులకు చేతనైనంతా సాయం చేయాలని ఉందని చెబుతూ వారికి చేయూత ఎలా అందించాలన్న దానిపై ఆలోచిస్తున్నామని తెలిపారు. విద్య, క్రీడా రంగాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక విధానం ఉండాలని సూచించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ కు తమ సమస్యలకు మీరైనా పరిష్కారం చూపాలని కోరుతూ బాధితులు…
దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి ‘‘లిక్కర్ ఫ్రంట్’’ పెట్టేందుకే ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నేతలతో చీకటి ఒప్పందం చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. పంజాబ్ లో ని డ్రగ్స్ ను తెలంగాణకు విస్తరింపజేయడానికి, తెలంగాణలోని లిక్కర్ సామ్రాజ్యాన్ని పంజాబ్, ఢిల్లీ, బెంగాల్ రాష్ట్రాలకు విస్తరింపజేసుకునేందుకే పరస్పర చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ నిందితులుగా పేర్కొన్న రామచంద్ర పిళ్లై, శరత్, స్రుజన్ రెడ్డి, అభిషేక్ లు కేసీఆర్ కుటుంబ బినామీలని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరుపుతోందని, త్వరలోనే కుటుంబం బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం లో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చాయని పేర్కొంటూ కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ వెళ్తున్నది లిక్కర్ దందా…
భారత్లో ఉగ్రదాడి కుట్రను రష్యా భగ్నం చేసింది. దేశంలో ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఐఎస్ఐఎస్.. కేంద్ర సర్కారులోని ఓ కీలక నేతను హత్య చేసేందుకు ఒక సూసైడ్ బాంబర్ను రంగంలోకి దింపింది. అయితే ఆ ఉగ్రవాదిని రష్యా అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ న్యూస్ ఏజెన్సీ ‘స్పుత్నిక్’ తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు ఒకరిని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అదుపులోకి తీసుకుంది. అతడు విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఓ దేశానికి చెందిన వాడని, సూసైడ్ బాంబర్ గా మారి భారత్ లో అధికార పార్టీలో ఉన్న ఓ రాజకీయ నేతను హతమార్చేందుకు ప్లాన్ చేశాడని ఎఫ్ఎస్బీ తెలిపింది. ప్రవక్తను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో దాడికి ప్లాన్ చేశానని ఆ ఉగ్రవాది తెలిపినట్లు ఎఫ్ఎస్బీ పేర్కొంది. ఆ సూసైడ్ బాంబర్ను టర్కీలో ఐఎస్ఐఎస్ రిక్రూట్ చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, ఐఎస్ఐఎస్ తోపాటు దాని అనుబంధ…
మూడేళ్ళుగా దాటవేస్తూ వచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరకు ఆదివారం నుండి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా ఈ పదవి ఎవరు చేపట్టాలో అనే విషయమై ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ తిరిగి చేపట్టాలని దాదాపు ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ అందుకు ఆయన తీవ్రంగా విముఖత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన కుటుంభం నుండి ఎవ్వరు ఉండకూడదని స్పష్టం చేస్తుండడంతో ప్రియాంక గాంధీకి కూడా ఆ పదవి చేపట్టే అవకాశం లేదని వెల్లడవుతుంది. ఎలాగూ అనారోగ్యం కారణంగా ఆ పదవిలో కొనసాగించలేమని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఆమెతో సహా, ఇంకా పార్టీలో పలువురు నాయకులు రాహుల్ గాంధీని ఒప్పించడానికి చేయవలసిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నెల 28లోగా నామినేషన్ దాఖలు చేయవలసి ఉంది. రాహుల్ తన విముఖతను విడనాడని పక్షంలో గాంధీ కుటుంభం బయటివారిని ఆ పదవికి ఎన్నుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అటువంటప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. గెహ్లాట్ గాంధీ…
ముఖ్యమంత్రి కేసీఆర్కు నిజం చెప్పకూడదనే శాపం ఉందని, నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట అని, అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరని, నోరు విప్పితే అబద్దాలే అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎన్నికలొస్తున్నయంటే అబద్దాలకు అంతుండదని అంటూ కేసీఆర్ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతదని ధ్వజమెత్తారు. తన ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజు ప్రపంచించి ఆయన తొలుత చాగల్లు గ్రామానికి చేరుకున్నారు. కేసీఆర్ అబద్దాలకు తాజా నిదర్శనం మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని గ్లోబల్స్ ప్రచారం చేయడమని ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న మాట నిజమైతే వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి లేదా లై డిటెక్టర్ టెస్ట్ కు కేసీఆర్ సిద్ధమా? అని సవాల్ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా అందుకు తాను సిద్ధం అని స్పష్టం…
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ మిగిలిన భారత దేశంలో విలీనం సంపూర్ణమనే సంకేతం ఇచ్చే విధంగా అక్కడున్న ఎవరైనా ఓటరుగా చేరవచ్చని ఎన్నికల కమీషన్ తాజాగా ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునరవ్యవస్థీకరణ ఈ మధ్యనే పూర్తి కావడంతో సత్వరం ఎన్నికలు జరిపే దిశలో ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారిస్తున్నారు. జమ్ముకాశ్మీర్ ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) హిర్దేష్ కుమార్ ఈ నెల 17న జారీ చేసిన ప్రకటన ప్రకారం జమ్ముకాశ్మీర్లో సాధారణంగా నివసిస్తును వారందరూ ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తినికల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ముకాశ్మీర్, లడఖ్గా ముక్కలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి పూర్వం అంటే జమ్ముకాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నికల ఓటర్ల జాబితాలో పేర్లు లేనివాళ్లు సైతం ఇప్పుడు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని…
కేసీఆర్ సర్కార్ను పడగొట్టేందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్యెల్యే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేలా ఈ మునుగోడు సభను చూస్తుంటే అర్థమవుతోందని భరోసా వ్యక్తం చేశారు. రాజగోపాల్రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడమంటే.. కేవలం ఒక్క నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం కాదని, ఇది కేసీఆర్ అవినీతి ప్రభుత్వ అంతానికి మార్గం వేయడమని ఆయన చెప్పారు. ‘‘మునుగోడులో రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం పతనానికి నాంది పడుతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది” అంటూ హర్షధ్వానాల మధ్య అమిత్ షా ప్రకటించారు. రాజగోపాల్రెడ్డిని బీజేపీలోకి చేర్చుకునేందుకు తాను ఇక్కడికి వచ్చానని చెబుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి లో చేరనున్న నేపథ్యంలో మునుగోడులో బిజెపి ఆదివారం…
‘చివరి రోజు వరకు ప్రతి ఓటు కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’ అంటూబ్రిటన్లో కన్సర్వేటివ్ పార్టీ నేత పదవికి తద్వారా దేశ ప్రధానిగా ఎన్నికయ్యేందుకుపోరాడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ ట్వీట్ చేస్తూ మాంచెస్టర్ ప్రచార వీడియోను విడుదల చేయడం ద్వారా సరికొత్త తరహా ప్రచారంకు తెరదించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు మరో రెండు వారాల గడువే ఉండటం, ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే వెనుకబడి ఉన్న నేపథ్యంలో రిషి సునాక్ వర్గం వ్యూహం మార్చిన్నట్లు కనిపిస్తున్నది. తుది వరకూ పోరాటమే తన నైజం అని ప్రకటించారు. అందులో “అండర్ డాగ్తో జాగ్రత్త అంటున్నారు. ఎందుకంటే ఓటమి అంచున ఉన్న వాళ్లు పోగొట్టుకునేదేమీ ఉండదు. ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటారు. వారు కష్టపడి పని చేస్తారు, ఎక్కువ సేపు ఉంటారు, తెలివిగా ఆలోచిస్తారు. అండర్ డాగ్లు అవకాశాన్ని వదులుకోరు. కష్టపడి పని చేస్తూ.. ఎప్పుడూ ఆత్మసంతృప్తి చెందరు’’ అని ఆ వీడియోలో వాయస్ ఓవర్ వినిపిస్తుంటుంది. …
ఉగ్రవాద ఆరోపణలపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (69)ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం ఇస్లామాబాద్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పోలీసింగ్, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆయన వ్యాఖ్యలు ఆ వ్యవస్థలను బెదిరించేవిగా ఉన్నాయని పేర్కొంటూ పాక్ యాంటీ-టెర్రరిజం యాక్ట్ సెక్షన్ -7 ప్రకారం ఇస్లామాబాద్ మార్గల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం పాక్ మంత్రి రానా సనావుల్లా మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని, ఆయనపై కేసు నమోదు అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఆ కొద్ది గంటలకే మాజీ ప్రధానిపై కేసు నమోదు అయ్యింది. ఖాన్ తన ప్రసంగంలో ‘‘అత్యున్నత పోలీసు అధికారులను, గౌరవనీయమైన మహిళా అదనపు సెషన్స్ జడ్జిని, పాక్ ఎన్నికల సంఘాన్ని భయభ్రాంతులకు గురిచేశారని, బెదిరించారని’’ మార్గల్లా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పాక్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ స్థానిక ఛానెళ్లకు తీవ్ర హెచ్చరికలు…