దేశంలో కరోనా ఉధృతమవుతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనాబారిన పడ్డారు. అరవింద్ కేజ్రీవాల్కు మంగళవారం ఉదయం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో తాను ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నానని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.‘‘నాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది.కరోనా తేలికపాటి లక్షణాలుండటంతో ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు మీరు ఐసోలేషన్లో ఉండండి. మీరు కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి పరీక్షలు చేయించుకోగా వైరస్ నిర్ధారణ అయింది. కొవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, కొన్ని రోజుల నుంచి తనను కలిసినవారు టెస్టులకు వెళ్లాలని రేవంత్ ట్వీట్ చేశారు. రేవంత్ గతంలోనూ ఒకసారి కరోనా బారినపడ్డారు. తాజాగా పాజిటివ్గా నిర్ధారణ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో జరిగే పార్టీ సమావేశాల్లో జూమ్ యాప్ ద్వారా పాల్గొననున్నట్లు…
Author: Editor's Desk, Tattva News
బంగ్లా యుద్ధం – 20 పాకిస్తాన్పై నిర్ణయాత్మక విజయాన్ని సాధించడానికి భారతదేశం సైనిక పోరాటాన్ని చాలా ధీటుగా అమలు చేసింది. 92,000 మందికి పైగా పాకిస్థాన్ సైనికులు, పారామిలటరీ, పోలీసు సిబ్బంది, పౌరులు లొంగిపోయారు. పశ్చిమ ఫ్రంట్లో 120 చదరపు మైళ్ల నష్టానికి వ్యతిరేకంగా 5,620 చదరపు మైళ్ల భూభాగం స్వాధీనం చేసుకుంది. అయితే, అర్థవంతమైన పాఠాలు నేర్చుకోవడానికి విమర్శనాత్మక విశ్లేషణ తప్పనిసరి కాగలదు. భారత్ పరిమిత లక్ష్యమైన తూర్పు పాకిస్థాన్ నుండి వస్తున్న శరణార్థులను చూపి, అక్కడ పాకిస్థాన్ సైనికుల దారుణ మారణకాండను అడ్డుకోవడం కోసం ఆ దేశంపై రాజకీయ వత్తిడి తేవడం పైననే ప్రధానంగా దృష్టి సారించింది. అందుకోసం పరిమిత స్థాయిలో సైనిక జోక్యంకు వీలుగా ప్రణాళికలు వేసుకొంది. కానీ, ఢాకా నగరాన్ని చుట్టుముట్టి, మొత్తం దేశాన్ని స్వాధీనం లోకి తెచ్చుకొని, తామే బాంగ్లాదేశ్ ఓ ప్రత్యేక దేశంగా అవతరించేటట్లు చేయాలనే విస్తృతమైన వ్యూహం ఏర్పర్చుకోలేదు. ఆ విధంగా చేసిన్నట్లయితే,…
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. రాహుల్ పూర్వీకులు తాము యాక్సిడెంటల్ హిందువులమని చెప్పుకునేవారని అంటూ గాంతంలో తొలి ప్రధాని, రాహుల్ తాత జవహర్ లాల్ నెహ్రు చెప్పిన మాటలను యోగి గుర్తు చేశారు. గతంలో ప్రాతినిధ్యం వహించి, గత ఎన్నికలలో రాహుల్ గాంధీ ఓటమి చెందిన ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాహుల్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ తనను తాను హిందువునని ఎప్పటికీ చెప్పుకోలేరని యోగి స్పష్టం చేశారు. రాహుల్ కేరళకు వెళ్లి అమేథీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, విదేశాలకు వెళ్లి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడతారని ఆయన విమర్శించారు. రాహుల్లా కాకుండా హిందువులమని గర్వంగా చెప్పాలని పేర్కొన్నారు. ఎన్నికల పర్యటనల తర్వాత రాహుల్ గాంధీ మాయమైపోతుంటారని యోగి జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీకి గుడిలో ఎలా కూర్చోవాలో కూడా తెలియదని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. గాంధీ…
ద్వేషపూరిత ప్రసంగాలు మన దేశ సంస్కృతి, రాజ్యాంగం, ధర్మాలకు విరుద్ధమని పేర్కొంటూ “ప్రతి వ్యక్తికి తన విశ్వాసాన్ని ఆచరించడానికి, బోధించడానికి హక్కు ఉంది” అని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హితవు చెప్పారు. కేరళలోని కొట్టాయంలో సెయింట్ కురియాకోస్ ఎలియాస్ చవర 150వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “ద్వేషపూరిత ప్రసంగాలు, రచనలు (దేశం) సంస్కృతి, వారసత్వం, సంప్రదాయం, రాజ్యాంగ హక్కులు, ధర్మాలకు విరుద్ధం అని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తికి దేశంలో తన విశ్వాసాన్ని ఆచరించడానికి, బోధించడానికి హక్కు ఉంది అని త్లెఇపారు. “మీ మతాన్ని ఆచరించండి, కానీ ద్వేషపూరిత ప్రసంగాలు, రాతలను దుర్వినియోగం చేయవద్దు,” అని అతను చెప్పారు. “ఇతర మతాలను అపహాస్యం చేయడం, సమాజంలో విభేదాలను సృష్టించే ప్రయత్నాలను తిరస్కరించాలి” అని ఆయన పిలుపిచ్చారు. 19వ శతాబ్దపు కాథలిక్ మతగురువు, తత్వవేత్త, సంఘ సంస్కర్త అయిన సెయింట్ చవర గురించి మాట్లాడుతూ, “శాంతియుతమైన మానవ సంబంధాలు అన్నింటికంటే పవిత్రమైనవని, అన్నింటికంటే…
కరోనా నిబంధనలకు విరుద్ధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన కార్యాలయంలో కరీంనగర్ లో తలపెట్టిన జాగరణ దీక్షను భగ్నం చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు, బెయిల్ ఇవ్వడానికికి వీల్లేని నిబంధనలతో అరెస్ట్ చేయడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. కరోనా నిబంధనల అమలు కేవలం ప్రతిపక్షాల నిరసనలు అడ్డుకోవడానికేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే జిఓ ను అధికార పక్షంకు ఒక విధంగా, ప్రతిపక్షాలకు మరోవిధంగా పొలిసులు అమలు జరుపుతూ ఉండడంతో వారి రాజకీయ ఉద్దేశ్యాలతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనల్ని రూపొందించాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలు పెట్టొదని ఆదేశించారు. మాస్క్ తప్పనిసరని, భౌతిక దూరం పాటించాలని ఉత్తరువులు జారీ చేశారు. అయితే అధికార పార్టీ నేతలకు మాత్రం ఇటువంటి నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. అధికారిక కార్యక్రమాల్లోనూ నిబంధనలకు మంగళమ్ పాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు రూల్స్ ఫాలో కావడం లేదన్న ఆరోపణలున్నాయి. డిసెంబర్ 29న సీఎం…
వేతన సవరణ అంశంపై గత నెలరోజులకు పైగా నిర్ణయం తీసుకోకుండా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి దాటవేత ధోరణులు అవలంభించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వేతన సవరణ నివేదికను బహిరంగ పరచక పోవడం, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పా ముఖ్యమంత్రి చర్చలకు పిలవక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఆర్సి అమలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్తో పాటు మిగిలిన అన్ని సమస్యలపై ఇకపై సిఎం జగన్మోహన్రెడ్డితో మాత్రమే చర్చిస్తామని ఎపిజెఎసి, ఎపిజెఎసి అమరావతి జెఎసి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ నెల 9న అన్ని జిల్లాల నుంచి ఇరు జెఎసిల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి జెఎసి నేతలతో విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాస్తున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం సంయుక్త జెఎసిల పక్షాన ఉద్యమ…
దేశవ్యాప్తంగా 15 నుండి 18ఏళ్ల వయసు గల టీనేజర్లకు సోమవారం ప్రారంభమైన కరోనా టీకాల ప్రక్రియకు మొదటిరోజే పెద్దఎత్తున స్పందన లభించింది. ఇప్పటివరకు 16.85లక్షల మందికి పైగా టీకాలు వేయించుకున్నారు. ఈనెల 1వ తేదీ నుంచే కరోనా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కోవిన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవడమే కాకుండా వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి కూడా రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతించడంతో వీరి సంఖ్య పెరుగుతోంది. కొన్ని చోట్ల ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో టీనేజర్లకు టీకా కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది వరకు టీనేజర్లు ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతానికి, భారత్ బయోటెక్ తీసుకువచ్చిన కోవాక్సిన్ను మాత్రమే 18ఏళ్లలోపు పిల్లలకు ఆమోదించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్ ట్వీట్ చేశారు.…
బంగ్లా యుద్ధం – 191971 యుద్ధంలో వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా పాకిస్థాన్ గందరగోళ పరిస్థితులలో ఉండడం కూడా భారత్ సేనలు అనూహ్య విజయం సాధించడానికి దారితీసిన్నట్లు చెప్పవచ్చు. తూర్పు పాకిస్థాన్ లో తాము సాగిస్తున్న మరణకాండపై భారత్ వ్యూహం ఏమిటో, సైనిక లక్ష్యాలు ఏమిటో పాక్ సేనలు గందరగోళంలో పడడమే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి అక్టోబర్ మధ్య నాటికి పాకిస్తాన్ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంది. నవంబర్ మధ్య నాటికి గాని భారత సైన్యం కార్యాచరణకు సిద్ధపడలేదు. అప్పటి వరకు సేనలు, సాధన సంపత్తి సమీకరణలో మునిగిపోయింది. సైనిక చర్య ద్వారా భారత్ జోక్యం చేసుకోకుండా కట్టడి చేయాలి అనుకొంటే, భారత సేనలు యుద్దానికి సిద్దపడేంత వరకు ఎందుకు ఎదురు చూసారు? అంతుబట్టని ప్రశ్న. అక్టోబర్ లోనే పాకిస్థాన్ ఆకస్మిక దాడికి దిగి ఉంటే, భారత సైన్యానికి పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. పాకిస్తాన్ తన దాడిని ప్రారంభించే వరకు భారత్ …
డా. దాసరి శ్రీనివాసులు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భారత దేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగాగుర్తింపు పొందిన సావిత్రిబాయి ఫూలే సామజిక సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి. బ్రిటిష్ హయాంలో మహిళలు ఇల్లుదాటి బైటకు రావడం పాపంగా భావించే రోజులలో, వారి హక్కుల గురించి ఎవ్వరు పట్టించుకోనని సమయంలో ఆమె మహిళా విద్య కోసం, సామజిక రుగ్మతల నిర్ములన కోసం విశేషంగా కృషిచేసిన మహారాష్ట్రలోని పేరొందిన సామజిక సంస్కర్తలలో ఒకరుగా గుర్తింపు పొందారు. సామాజిక ఉద్యమాలలో క్రియాశీలంగా పాల్గొంటున్న భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో మహిళల వికాసం కోసం కృషి చేయడమే కాకుండా దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు. సంపన్న వ్యవసాయ కుటుంభంలో, వెనుకబడిన సామాజిక వర్గంలో మహారాష్ట్రలోని సతారా జిల్లా నాగన్ లో 1931 జనవరి 3న ఆమె జన్మించారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే 13 ఏళ్ళ జ్యోతిరావుతో ఆమెకు వివాహం జరిగింది. సనాతన హైందవ గ్రంధాలు అన్నింటిని…
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం సాయంత్రం కరీంనగర్లో తన కార్యాలయంలో తలపెట్టిన జాగరణ దీక్ష తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసుల లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది. కార్యాలయం లోపలి నుంచి తాళం వేసుకుని సంజయ్ దీక్షకు దిగగా.. రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో సంజయ్ అక్కడే రాత్రంతా దీక్ష కొనసాగించారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో సభకు అనుమతి లేదని, నిర్వహించవద్దని పోలీసులు ఉదయమే నోటీసులు జారీచేశారు. అయినా పెద్దయెత్తున కార్యకర్తలు దీక్షా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు వచ్చినవారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు. సాయంత్రానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం గుమిగూడటంతో పోలీసులు పలుమార్లు లాఠీలకు పనిచెప్పారు. కార్యకర్తలను చెదరగొట్టేందుకు…