Author: Editor's Desk, Tattva News

అధిక ద్రవ్యోల్బణానికి తోడు వినిమయం పడిపోవడంతో అమెరికా ఇప్పటికే ఆర్థిక మాంద్యంలోకి జారుకున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అహార, ఇంధన వినియోగదారుల ధరల సూచీ తమ అంచనాల కంటే ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు.  అమెరికాలో గడచిన మేలో వినియోగదారుల ద్రవ్యోల్బణ సూచీ 8.6 శాతానికి ఎగిసింది. 1981 తర్వాత అంటే గడిచిన 40 ఏళ్ల తర్వాత ఇదే అత్యధిక ధరల పోటు. ఆర్థిక నిపుణులతో సిఎన్‌బిసి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అమెరికా చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ మైకెల్‌ హర్ట్‌నెట్‌ మాట్లాడుతూ.. ” సాంకేతికంగా సంక్షోభంలోనే ఉన్నాం. కానీ.. దీన్ని మనం నమ్మడం లేదు” అని పేర్కొన్నారు.  బ్లెక్లే అడ్బైజర్‌ గ్రూపు చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ పీటర్‌ బక్‌వర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సంక్షోభం ప్రారంభం కానుందని.. ఇందులో అశ్యర్యపోవాల్సిందేమీ లేదని తెలిపారు. సంక్షోభ ప్రారంభానికి మధ్యలో ఉన్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఏడాది దేశ జిడిపి…

Read More

అగ్నిపథ్ పై యువకుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మూడు రైళ్లకు నిరసనకారులు నిప్పటించారు. అలాగే 20 బైక్ లను కూడా తగులబెట్టారు. దీంతో రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.  నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు యువకులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తున్నది.  రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు.  గూడ్స్ రైలులో ఉన్న సామాన్ల‌ను ప‌ట్టాల‌పై ప‌డేశారు. ఫ్లాట్‌ఫామ్‌పైన ఉన్న షాపుల‌ను ఆందోళ‌న‌కారులు ధ్వంసం చేశారు. భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ప్ర‌యాణికులు స్టేష‌న్ విడిచి వెళ్తుతున్న దృశ్యాలు క‌నిపించాయి. కాగా, బీహార్‌లోని ల‌ఖ్మినియా రైల్వే స్టేష‌న్‌కు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాక్‌ల‌ను ధ్వంసం చేసి రైళ్ల‌ను నిలిపివేశారు. నాలుగేళ్ల ఉద్యోగం పేరుతో అగ్నిప‌థ్ స్కీమ్‌ను ర‌క్ష‌ణ శాఖ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  భ‌గ‌ల్‌పూర్‌, న్యూఢిల్లీ మ‌ధ్య న‌డిచే విక్ర‌మ్‌శిలా…

Read More

ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రస్తావిస్తూ అందులో చూపిన కాశ్మీర్ పండిట్లపై దాడులను ఆమె గోరక్షకుల దాడులతో పోల్చుతూ మాట్లాడటం  వివాదాస్పదంగా  మారింది. దానితో ఆమెపై భజరంగ్‌దళ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ విషయమై సీనియర్ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి స్పందిస్తూ ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని అంటూ సున్నితంగా ఆమెను మందలించారు.  ఓ యూట్యూబ్ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్‌బజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.సాయిపల్లవి వ్యాఖ్యలపై వీడియో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు తెలిపారు. సాయిపల్లవి ఇటీవల ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వూలో మాట్లాడుతూ… ‘‘కొన్ని రోజుల ముందు ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు…

Read More

జమ్మూ-కశ్మీరులో శాంతికి భంగం కలిగించాలని పాకిస్థాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం ఆయన బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్‌ను వెయ్యి ముక్కలు చేసి, రక్తపు మడుగులో ముంచాలనేది పాకిస్థాన్ వైఖరి అని చెప్పారు. భారత్  వేయి ముక్కలు చేసి రక్తపాతం సృష్టించాలన్నదే పాకిస్థాన్ సైనిక సిద్ధాంతం. భారత దేశంపై పరోక్ష యుద్ధం చేయాలనేది ఈ సిద్ధాంత సారాంశం అని ఆయన మండిపడ్డారు. అనేక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులతో యుద్ధం చేయాలనేది పాకిస్థాన్  వ్యూహం అని స్పష్టం చేశారు.  మన పొరుగు దేశం (పాకిస్థాన్) నిరంతరం భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలను మనం ఎదుర్కొన్నామని చెప్పారు. భారత దేశాన్ని వెయ్యి ముక్కలు చేసి, రక్తమోడేలా చేయాలనే సిద్ధాంతంతో శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని హెచ్చరించారు.  దేశ ఐకమత్యం, సమగ్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే, భద్రతా దళాలు పాకిస్థాన్‌కు దీటుగా సమాధానం…

Read More

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించి తన త‌ర్వాత త‌న‌ సొంత గడ్డ నిజామాబాద్ నగరానికి గురువారం తొలిసారిగా అడుగుపెట్టిన అంతర్జాతీయ బాక్సర్ నిఖత్ జరీన్ కు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిఖత్ జరీన్ రాకతో న‌జామాబాద్ లో సందడి వాతావరణం సంతరించుకుంది.  న్యూ అంబేడ్కర్ భవన్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ ఆమీర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, నగర మేయర్ నీతూకిరణ్ తదితరులు నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం పలికారు.  మంత్రి ప్రశాంత్ రెడ్డి నిఖత్ కు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని, ఆమెకు బాక్సింగ్ లో ఓనమాలు నేర్పించిన తొలి గురువు అయిన కోచ్ సంసాముద్దీన్ కు యాభై వేల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. కాగా, ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించి నిజామాబాద్ కు వచ్చిన తనకు…

Read More

తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని  సద్గురు  జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని కొనియాడారు.  వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోందని సద్గరు జగ్గీ వాసదేవ్ హెచ్చరించారు. పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని స్పష్టం చేస్తూ వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.  సేవ్ సాయిల్ (మట్టిని రక్షించు) ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరు పయనం అయ్యారు. మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు.  చిన్న వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన…

Read More

గ‌త కొంత‌కాలంగా త‌గ్గుతూ వ‌చ్చిన కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింప‌వుతుంది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 12 వేలు దాటింది. కొత్తగా 12,213 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఫిబ్రవరి 26 తర్వాత అంటే గత 109 రోజుల్లో ఒకేరోజు 10 వేలకుపైగా కేసులు రికార్డవడం ఇదే మొదటిసారి. కాగా, బుధవారం నాటికంటే ఇది 38.4 శాతం అధికం. యాక్టివ్‌ కేసులు కూడా 60 వేలకు చేరువయ్యాయి. రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మొత్త బాధితులు 4,32,57,730కి చేరారు.  ఇందులో 4,26,74,712 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,803 మంది మరణించారు. మరో 58,215 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 11 మంది కరోనాతో మృతిచెందగా, 7624 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఈ దఫా కూడా…

Read More

‘‘ కేసీఆర్…. నువ్వు సీఎంగా ఉండేది మహా అంటే 6 నెలలు.. ఏడాదే…. రాష్ట్ర ప్రజలను రాచి రంపాన పెడుతున్నవ్… వాళ్ల ఉసురు నీకు తగలక మానదు’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరాచకంతో సైకోలా మారితే రాష్ట్ర ప్రజలు తిరగబడటం ఖాయమని హెచ్చరించారు.   సంజయ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు బుధవారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ డా. తమిళసై సౌందర రాజన్ ను కలిశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుసహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి గవర్నర్ కు వినతి పత్రం అందించారు.  అదే విధంగా గౌరవెల్లి బాధితులతో కలిసి గౌరవెల్లి నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్, పరిహారం విషయంలో…

Read More

రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా  ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అభ్యర్థిత్వం విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ పవార్ ఆసక్తి చూపించకపోవడంతో మరో అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించారు.  ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో జరిపిన సమావేశంలో ఓ నిర్ణయానికి రాలేక పోయినా రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ రెండు పేర్లను ఆమె ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. అవి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ – రాజగోపాలాచారిల మానవుడు గోపాలకృష్ణ గాంధీగా ప్రకటించారు. వామపక్షాలు అయితే గోపాలకృష్ణ గాంధీ అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపుతున్నాయి.  సమావేశం అనంతరం మమత మాట్లాడుతూ..  అభ్యర్థి విషయమై మళ్లీ భేటీ అవుతామని,  ఏకాభిప్రాయాలున్న పార్టీలు  ఒకే తాటిపైకి రావడం శుభపరిణామమని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసేందుకు శరద్‌ పవార్‌ ముందే విముఖత వ్యక్తం చేసినా సమావేశంలో మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే,  క్రియాశీలక…

Read More

వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్‌ నిర్వహించడానికి బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షా నేతృత్వంలో 2023 నుంచి మహిళల ఐపీఎల్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు కార్యాచరణ సిద్ధమవుతోంది. బుధవారం జరిగిన బీసీసీఐ సమావేశం అనంతరం జై షా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.  దేశీయంగా క్రికెట్‌ను మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే 2023 నుంచి మహిళల  ఐపీఎల్‌ టోర్నమెంట్‌ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.  ఇకపై కేవలం ఐపీఎల్‌ కోసం అన్ని క్రికెట్‌ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్‌ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలిపిందని బీసీసీఐ వెల్లడించింది.  ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్‌లో ఐపీఎల్‌ కోసం ప్రత్యేకంగా రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.  మీడియా హక్కుల వేలం ద్వారా భారీ ఆదాయం రావడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ హర్సం వ్యక్తం చేశారు. క్రికెట్‌…

Read More