దేశంలోనే అత్యంత ఆధునిక పోలీస్ నిఘా వ్యవస్థకు వీలు కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఈ నెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలను కోరారు. వచ్చిన వాటిలో అత్యుత్తమైన పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేస్తారని, ఆ పేరు సూచించిన వారిని కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభోత్సవం రోజున సత్కరిస్తామని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆయన ట్వీట్కు స్పందించిన కొందరు నెటిజన్లు ‘క్వాడ్ కాప్’, ‘పోలీస్ టవర్స్ 4.0’, ‘టీ టవర్స్’, ‘విజిల్స్ అర్బన్’ ‘తెలంగాణ పోలీస్ మినార్’, ‘రక్షక్ స్క్వేర్’ ‘ఫాల్కన్ టవర్స్’, ‘డెక్కన్ ఎస్ స్క్వాడ్’ ‘సురక్షా భవన్’ వంటి పేర్లు సూచించారు. తమ అభ్యర్థనను మన్నించి అద్భుతమైన పేర్లను సూచిస్తున్నందుకు నెటిజన్లకు ధన్యవాదాలు చెబుతూ సీవీ ఆనంద్…
Author: Editor's Desk, Tattva News
భూ సంస్కరణల్లో భాగంగా కొత్త విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ‘ఒకే దేశం -ఒకే రిజిస్ట్రేషన్’ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ’ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్’ సాఫ్ట్వేర్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎన్జిడిఆర్ఎస్)తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీడ్లు, రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ‘మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు’ సీతారామన్ తెలిపారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్ప్రైజ్, హబ్ల అభివృద్ధిని…
రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధినిఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటించారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. అలాగే ఆర్బీఐ ద్వారా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీని రూపొందిస్తామని, కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పన జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) డిడక్షన్ ఉంటుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్పిఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం గంటన్నర సేపు సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రసంగాన్ని 11.00 గంటలకు ప్రారంభించిన మంత్రి పన్నెండున్నర గంటలకు ముగించారు. ఐటీ రిటర్న్…
ఈసారి కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి(సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు కేంద్ర బడ్జెట్ 2022ను ప్రవేశపెడుతూ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే, డిజిటల్ రుపీతో పాటు డిజిటల్ భారత్ పై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రియ పద్దతిలో వ్యవసాయం ప్రస్తుత కరోనా సమయంలో చాలా ముఖ్యం అని మంత్రి తెలిపారు. అందుకే ఆ దిశగా కెమికల్-ఫ్రీ నేచురల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో గంగానది పరివాహక ప్రాంతాల్లోని 5 కిలోమీటర్లలోపు ఉన్న వ్యవసాయ భూముల రైతులతో పైలెట్ ప్రాజెక్ట్గా చేపడతామన్నారు. అలాగే రాష్ట్రాలు కూడా ఈ విధాన్ని ఊతమిచ్చేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్లో మార్పు చేసి సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా పాఠ్యాంశాలు తీసుకురావాలని కోరారు. ఆర్గానికి ఫార్మింగ్, మోడ్రన్-డే అగ్రికల్చర్లకు ప్రోత్సహకాలను తగ్గించాలని తెలిపారు. అప్పుడే సేంద్రియ వ్యవసాయం ఆచరణలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆరోగ్యానికి రసాయనాలు వాడి పండిస్తున్న…
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఆందోళనలు మరింత తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాతో పాటు, ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యత ఉన్న రాయలసీమ జిల్లాల్లో చిచ్చు రేపుతున్నది. అధికార పార్టీకి చెందిన నేతలే పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. కడపను విడదీసి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ డిమాండ్పై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా వైసీపీకి ఆవిర్భావం నుంచి కంచుకోటల్లా ఉన్న ప్రధాన గ్రామాల్లో ‘వైసీపీకి ఇక సెలవు’ అంటూ హైవేలపై హోర్డింగ్లు పెట్టారు. అదేవిధంగా గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు భారీ మెజారిటీతో గెలుపొందిన రాజంపేట, కోడూరు నియోజకర్గాల్లో ఇక్కడి ప్రజాప్రతినిధులు కనిపించడం లేదని.. వీరి ఆచూకీ…
హైకోర్టు ఆదేశించినా అనుచిత పోస్టింగ్స్ తొలగించలేదని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టులు, జడ్జీలపై ట్విట్టర్లోని పోస్టింగ్స్ తీయకపోవడంపై మండిపడింది. సాంకేతిక కారణాలు చూపించి కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. న్యాయప్రక్రియతో దోబూచులాడొద్దని, ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గత విచారణ సందర్భంగా పోస్టులు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసింది. తమ ఆదేశాలు అమలు చేయనందుకు కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని నిలదీసింది. తదుపరి విచారణలోగా అలాంటి పోస్టింగ్స్ తొలగించాలని చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి డివిజన్ బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. దేశంలో సేవలు అందించాలంటే ఇక్కడి చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది. అలా పాటించనప్పుడు వ్యాపారాన్ని మూసివేసుకోవాలని తేల్చిచెప్పింది. ఇక్కడి చట్టాలను ఉల్లంఘించినందుకు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. కోర్టు…
ఆత్మనిర్భర్ భారత్ – 1 ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం కావించిన కరోనా విపత్తును భారత ప్రభుత్వం ఒక పెద్ద అవకాశంగా భావించి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగంలో కొత్త కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ఒక ప్రధాన, ప్రభావవంతమైన భాగంగా చేయాలనే లక్ష్యాన్ని కూడా మన ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ పథకాలన్నింటి అంతిమ లక్ష్యం ‘స్వయం సమృద్ధి, సుసంపన్నమైన, సామర్థ్యం గల భారతదేశం’. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ‘స్వలంబిత భారతదేశం’ ప్రకటన ఈ రోజు దేశ ఆకాంక్షకు మూలంగా మారింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రకటనతో ప్రభావితులయ్యారు. స్ఫూర్తి పొందారు. ఇప్పుడు ‘స్వయంశక్తి’ అనేది సమాజంలోని ప్రతి వ్యక్తి, ప్రతి సమాజం కలగా మారింది. శ్రీ నరేంద్ర మోదీ ఆ వ్యక్తి లేదా సమాజ…
దేశ పౌరులు తమ వివిధ అవసరాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం పలు గుర్తింపు పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, పాన్ ల వంటివి. ఇవన్నీ ఒకే డిజిటల్ ఐడెంటిటీ గా మారితే ..! అప్పుడు ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును అప్పటికప్పుడే వాడుకోవడానికి వీలుంటుంది. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం (ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్)గా ఈ కొత్త మోడల్ను రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ ప్రతిపాదన తయారు చేస్తున్నది ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్ట్, పాన్.. ఇలాంటి గుర్తింపు పత్రాలన్నింటినీ (ఐడి లను) అనుసంధానం చేస్తూ కొత్తగా ‘ఒకే డిజిటల్ ఐడి’ ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓ వార్తా సంస్థ సమాచారం మేరకు, ప్రస్తుతం దేశ పౌరులు వివిధ అవసరాల కోసం ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్…
ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు నకిలీ సమాజ్వాద్.. పేదల ప్రభుత్వం మధ్య జరుగుతున్నవిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలి దశలో భాగంగా ఓటింగ్ జరిగే ముజఫర్ నగర్, బాగ్పట్, సహరాన్పూర్, గౌతమ్ బుద్ధ నగర్ ఓటర్లనుద్దేశించి.. తొలి వర్చువల్ సమావేశాన్ని ప్రధాని మోదీ నిర్వహించారు. ‘యుపిలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతిపక్షం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అటువంటి వారికే ఈ పార్టీ టికెట్లు ఇస్తోంది.అందుకు వారి ప్రవర్తనే నిదర్శనం. నేరస్తులు రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు’ అని మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ప్రస్తుత ఎన్నికలలో గెలుపుకోసం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని ప్రధాని ఆరోపిస్తూ బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తుందని ధ్వజమెత్తారు. యుపిలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్పి చెబుతోందని గుర్తు చేస్తూ పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, మెడికల్…
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన వివిధ పోర్టల్స్లో జమ్మూకశ్మీర్, లడక్ ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకంటే భిన్నమైన రంగులో చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అలాగే, 1963లో చైనాకు పాకిస్థాన్ చట్ట విరుద్ధంగా ఇచ్చిన 5168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని షేక్స్గమ్ వ్యాలీని చైనాలో భాగంగా చూపించారు. 1954లో చైనా ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని లేత నీలం రంగు గళ్లలో చూపించారు. చైనా భూభాగాన్ని చూపించడానికి ఉపయోగించిన రంగు కూడా ఇదే. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ఈ విషయాన్ని బలంగా లేవనెత్తినట్టు చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ పోర్టల్స్లో భారతదేశ సరిహద్దులను తప్పుగా…